తన సినీ కెరీర్‌లో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకున్న బాలీవుడ్ అందమైన, ప్రతిభావంతురాలైన నటి, కంగనా రనౌత్ తన రాబోయే చిత్రం పంగాను ప్రమోట్ చేయడానికి రైల్వే ఉద్యోగిలా మారింది. ఇటీవలే చిత్ర నిర్మాతలు పంగ ట్రైలర్‌ను విడుదల చేశారు, ఈ ట్రైలర్ సినీ ప్రేక్షకులను అలరించింది. ఇక కంగనా రనౌత్ సినిమా ప్రమోషన్ల కోసం ముంబై చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వద్ద రైల్వే టిక్కెట్లు అమ్మింది.

 

కంగనా రనౌత్ తన చిత్రం పంగాలో రైల్వే ఉద్యోగిగా నటిస్తోంది. ఆమె తన సినిమా ప్రమోషన్ కొరకు ఈ ప్రత్యేకమైన ఆలోచన చేశారు. ఆమె ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ వద్ద కౌంటర్లో టిక్కెట్లు విక్రయించడానికి నిర్ణయించుకుంది. ముంబైలోని స్టేషన్‌లో టికెట్ కౌంటర్ లోపల కంగన్ రనౌత్ కూర్చొని టిక్కెట్లు అమ్ముతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టిక్కెట్లు అమ్మెందుకు చాలా సింపుల్ కాటన్ సల్వార్ సూట్ ధరించి, తక్కువ మేకప్ తో కనిపించింది కంగనా. కంగనా తన అభిమానులకు ట్రైన్ టిక్కెట్లు ఇస్తున్న దృశ్యాలను పంగా చిత్ర బృందం సోషల్ మీడియా సైట్లలో షేర్ చేసింది.

 

తను ధరించిన సూట్ లో కంగనా రనౌత్ ఒక సాధారణ మధ్యతరగతి మహిళ లా కనిపించారు. కంగనా రనౌత్ నటిస్తున్న పంగా సినిమాకు దర్శకత్వం వహిస్తున్న అశ్విని అయ్యర్ తివారీ, వాస్తవంగా కనిపించే భారతీయ కుటుంబాల నేపథ్యంలో పాత్రల యొక్క సంబంధాలు మరియు ఆకాంక్షల గురించి స్లైస్ ఆఫ్ లైఫ్ చిత్రాలను రూపొందించడంలో ప్రసిద్ధి. పంగాలో, కంగనా రనౌత్ ఒక మధ్యతరగతి వివాహిత మహిళ, తల్లి పాత్రను పోషిస్తున్నారు, ఇక ఈ సినిమాలో రైల్వే టికెట్ ఎగ్జిక్యూటివ్ గా కనిపించనున్నారు కంగనా రనౌత్. పంగా వివాహితురాలైన ఒక మహిళ జాతీయ స్థాయి కబ్బడి క్రీడాకారిణిగా ఎలా ఎదిగిందనేదే కథ. జీవితంలో ఈ స్థాయిని పొందడానికి ఆమె కుటుంబం ఆమెకు ఎలా తోడ్పడిందో ఈ చిత్ర కథాంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: