మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక చాలా కాలం సతమతం అవడం జరిగింది. అయితే ఎట్టకేలకు కొద్దిరోజుల క్రితం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తేజ్ నటించిన చిత్రలహరి సినిమా మంచి సక్సెస్ సాధించడంతో, తేజ్ కు ఫైనల్ గా మంచి సక్సెస్ లభించింది. ఇక ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తేజ్ నటించిన తాజా సినిమా ప్రతిరోజు పండగే, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి దిగ్విజయంగా దూసుకుపోతోంది. అలరించే మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, 

 

సెంటిమెంట్ వంటివి కలగలిపి తెరకెక్కించిన ఈ సినిమా పై మెజారిటీ ప్రేక్షకులు పాజిటివ్ రెస్పాన్స్ అందించడం జరిగింది. సత్యరాజ్, రావు రమేష్, విజయ్ కుమార్, నరేష్, మురళి శర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా, తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. తొలిరోజు తొలిఆట నుండి మంచి హిట్ టాక్ సంపాదించిన ఈ సినిమా దాదాపుగా అన్ని ప్రాంతాల నుండి మంచి కలెక్షన్స్ కూడా రాబడుతోంది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే పలువురు ప్రముఖులు కూడా మంచి ప్రశంశలు కురిపించగా, నిన్న సాయంత్రం ఈ సినిమాపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా మూవీ యూనిట్ కి అభినందనలు తెలిపారు. 

 

నేడు ప్రతిరోజు పండగే సినిమా చూసాను. కుటుంబంలోని బంధాలు, అనుబంధాల నేపథ్యంలో హృదయానికి హత్తుకునే సెంటిమెంట్ తో పాటు అలరించే ఎంటర్టైన్మెంట్ కలబోతగా రూపొందిన ఈ సినిమా తనకు ఎంతో నచ్చిందని, అలానే ఈ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న సినిమా యూనిట్ కు తన తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్లు రామ్ చరణ్ ఒక పోస్ట్ చేసారు. కాగా రామ్ చరణ్ చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: