అల్లు అర్జున్ హీరోగా మాటల మంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల.. వైకుంఠపురంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన పాటలు సూపర్ హిట్ అయి విపరీతంగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సిపిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా తర్వాత టాలెంటెడ్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించే సినిమా కూడా ఇటీవలే పూజా కార్యక్రమంతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాపై ఓ లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.

 

 

సినిమా రెగ్యులర్ షూటింగ్ ను సుకుమార్ ప్రారంభిచేశాడట. బన్నీ లేని కొన్ని సీన్లను తెరకెక్కిస్తున్నాడట. అయితే.. బన్నీ ఉండాల్సిన ఓ ముఖ్యమైన సీన్ ను కూడా సుకుమార్ తెరకెక్కించాడని సమాచారం. ప్రస్తుతం అల.. వైకుంఠపురం పనుల్లో బిజీగా ఉన్న బన్నీ ఈ షూటింగ్ పార్ట్ లో పాల్గొనలేకపోయాడని సమాచారం. టెక్నాలజీ అందుబాటులో ఉంది కాబట్టి బన్నీ సీన్లను తర్వాత చిత్రీకరించి వాటిని కంప్యూటర్ గ్రాఫిక్స్ లో ఉపయోగించాలన్నది సుక్కూ ప్లాన్ అని అంటున్నారు. అడవుల్లో వచ్చే సీన్లు మళ్లీ మళ్లీ దొరకవు కాబట్టి ఇలా ముందుగా ఆయా సన్నీవేశాల్ని పూర్తి చేశాడట.

 

 

ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా నటిస్తున్నట్టు సమాచారం. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే వేసవికి విడుదల చేయాలనేది దర్శక, నిర్మాతల ఆలోచనగా ఉంది. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బన్నీ చిత్తూరు డైలాగ్ స్లాంగ్ కూడా నేర్చుకుంటున్నాడని, త్వరలోనే ఈ సినిమాపై పూర్తి దృష్టి కేంద్రీకరించనున్నాడని టాలీవుడ్ లో జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: