స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. ఈ చిత్రం లోని మరో పాట ఈ రోజు (24-12-19) సాయంత్రం  4 గంటల 5 నిమిషాలకు సామాజిక మాధ్యమం అయిన 'యు ట్యూబ్' ద్వారా విడుదల అయింది. ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ గీతాన్ని యువ గాయకుడు 'అర్మాన్ మాలిక్' అద్భుతంగా ఆలపించారు. సంగీత దర్శకుడు తమన్ తన వీనుల విందైన బాణీలతో మరోసారి సంచలనం సృష్టించారు. 'బుట్ట బొమ్మా..బుట్ట బొమ్మా నన్ను సుట్టూ కుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టూ కుంటివే' అంటూ సాగే ఈ గీతం టీజర్ ఇటీవల విడుదలై పాట ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూసేలా చేసింది. ఇప్పుడు విడుదల అయిన ఈ పూర్తి గీతం అటు సంగీత ప్రియుల్ని, ఇటు ప్రేక్షకాభిమానులను విపరీతంగా అలరిస్తూ, ఈ చిత్రం నుంచి  విడుదలైన గీతాల రికార్డ్ ల సరసన చేరే దిశగా దూసుకు పోతోంది.

 

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు 'గీతా ఆర్ట్స్' 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న విడుదల అవుతోంది. ఈ చిత్రం నుండి ఈ రోజు బుట్ట బొమ్మ లిరికల్ సాంగ్ విడుదల అయింది. అయితే ఈ పాటకు ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రతి పాట ప్రేక్షకుల్ని రంజింపజేస్తుంది. అయితే ఈ పాట విడుదల అయిన కొద్దీ సేపటికే ఏడు లక్షల రియల్ టైం యూట్యూబ్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ చిత్రంలోని సామజవరాగమన, రాములో రాములా పాటలు యూత్ ని విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా సౌత్ ఇండియా లో టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్లాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: