ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు సినీ హీరో అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన చిత్రాల్లో రీఎంట్రీ పై ఇప్పటికే ఇండస్ట్రీలో ఒక క్లారిటీ వచ్చేసింది. బాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ అయినటువంటి “పింక్” చిత్రాన్ని రీమేక్ గా తెరకెక్కిస్తున్నామని నిర్మాత దిల్ రాజు ఖరారు చేసేసారు. దీనితో పవన్ అభిమానుల్లో ఒక పక్క ఆనందంతో పాటుగా ఒక రకమైన టెన్షన్ కూడా మొదలయ్యింది. అయితే ఇప్పుడు బయటకు వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం పవన్ ఈ చిత్రం తర్వాత మరో చిత్రం కూడా చేస్తారని తెలుస్తుంది.

 


అందులోను ఒక అద్భుతమైన దర్శకునితో చేయనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ దర్శకుడు మరెవరో కాదు టాలీవుడ్ ప్రేక్షకులకు అంటూ తమ జీవితంలో గుర్తుండిపోయే కొన్ని సినిమాల జాబితా తీస్తే అందులో తాను తెరకెక్కించిన రెండు చిత్రాలనూ నిలిపిన గౌతమ్ తిన్ననూరి అని తెలుస్తుంది. తాను తీసిన “మళ్ళీ రావా” మరియు “జెర్సీ” సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఎంతలా కనెక్ట్ అయ్యారో అందరికి తెలిసిందే. ఆ దర్శకునితో పవన్ 27వ సినిమా ఉండబోతుంది అని గాసిప్స్ వినిపిస్తున్నాయి. వీటిలో ఎంత వరకు నిజముందో కానీ ఈ కాంబో కానీ సెట్టయితే ఓ అద్భుతమైన సినిమా వస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

 

ఒక దశలో పవన్‌ ఇక సినిమాలు చేయడన్న ప్రచారం కూడా జరిగింది. పవన్‌ మాత్రం సినిమాల్లో కొనసాగుతానని గానీ.. ఇక సినిమాలు చేయనని గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అదే సమయంలో పవన్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పాడంటూ వస్తున్న వార్తలను కూడా ఖండించలేదు. దీంతో పవన్‌ ఇక సినిమాలను చేయరని భావించారు అంతా.

 

అయితే తాజాగా పవన్‌ రీ ఎంట్రీని కన్‌ఫర్మ్‌ చేస్తూ ప్రముఖ ఎనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీ్ట్‌ చేశారు. పవన్‌ రీ ఎంట్రీ సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్‌లో సూపర్‌ హిట్ అయిన పింక్‌ రీమేక్‌ను పవన్‌ ప్రధాన పాత్రలో తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాను కోలీవుడ్‌లో అజిత్ హీరోగా రీమేక్‌ చేసి సక్సెస్‌ అయిన బోనీ కపూర్‌ తెలుగు వర్షన్‌ కూడా నిర్మించనున్నాడు.

 


వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్‌పై పవన్‌ పీఆర్‌టీం గానీ, నిర్మాతలు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పవన్‌ చివరగా 2018లో రిలీజ్‌ అయిన అజ్ఞాతవాసి సినిమాలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: