బాహుబలి ద్వారా పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్ ప్రస్తుతం రాధాక్రిష్ణ దర్శకత్వంలో జాన్ అనే సినిమా చేస్తున్నాడు. జాన్ అనే టైటిల్ వర్కింగ్ టైటిల్ గా కొనసాగుతుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. 1970 లో జరిగే ప్రేమ కథాతో వస్తున్న ఈ చిత్రం నుండి ఎలాంటి అప్డేట్లు రావట్లేదు. సాహో సినిమా ఫెయిలయ్యాక ఈ సినిమా మీద మరింత జాగ్రత్తతో పని చేస్తున్నారట.

 

 

సాహో సినిమాకి ముందే ఈ సినిమాని ప్రకటించిన ప్రభాస్, ఆ తర్వాత చిత్రం గురించి ఇప్పటినుండే చర్చలు నడుస్తున్నాయి. మొన్నటి వరకు సైరా దర్శకుడయిన సురేందర్ రెడ్డి తో సినిమా ఉంటుందని, సురేందర్ స్క్రిప్టు కూడా రెడీ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ప్రభాస్ సినిమా గురించి మరో వార్త బయటకి వచ్చింది. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ వంగాతో ప్రభాస్ సినిమా చేయబోతున్నాడట.

 

 

సందీప్ వంగా ఈ ఏడాది అర్జున్ రెడ్డి  చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు డెవిల్ పేరుతో బాలీవుడ్‌లోనే మరో చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు సందీప్. అయితే ఈ మూవీ అయిన తరువాత మళ్లీ టాలీవుడ్‌కే రావాలని ఆయన అనుకుంటున్నారట. ఈ క్రమంలో ప్రభాస్‌తో తదుపరి సినిమా తీసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

 


ఈ మేరకు సందీప్ ప్రభాస్ కలుసుకుని కథ కూడా వినిపించాడట. సందీప్ కి కబీర్ సింగ్ ద్వారా బాలీవుడ్ లో కూడా మంచి పేరు వచ్చింది. అదీ గాక ప్రస్తుతం మళ్లీ బాలీవుడ్ లోనే సినిమా చేస్తున్నాడు. కాబట్టి  ప్రభాస్ కూడా సందీప్ తో సినిమాకి ఒప్పుకున్నట్లు సమాచారం.  మరి ఈ విషయం గురించి అధికారికంగా బయటకి వస్తే కానీ ఏమీ చెప్పలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: