కియారా అద్వానీ.. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది..ఈ భామ. ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్గా హోదా సంపాదించుకుంది. ఆ సినిమా హిట్ తర్వాత.. రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ'లోనూ తన అంద చందాలతో భాగానే ప్రేక్షకుల్నీ ఆకర్షించింది. ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఇక హిందీలో ఈ భామ అర్జున్ రెడ్డి రీమేక్.. కబీర్ సింగ్ లో చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని బాలీవుడ్లో జెండా పాతింది.
ప్రస్తుతం కియారా అద్వానీ అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో 'లక్ష్మీబాంబ్' అనే ఓ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తోంది. రణ్బీర్ కపూర్కు జోడీగా ‘షేర్షా’ సినిమా చేస్తోంది. ఇవే కాకుండా ‘గుడ్ న్యూస్’ అనే సినిమాలోనే నటిస్తోంది. అలాగే కియారా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘ఇందూ కీ జవానీ’. అబీర్ సేన్గుప్తా డైరెక్ట్ చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే.. ఇప్పుడు కియారా నటిస్తున్న ‘ఇందూ కీ జవానీ’ సినిమా, అక్షయ్ కుమార్తో కలిసి నటిస్తున్న ‘లక్ష్మీ బాంబ్’ సినిమా ఒకే రోజున విడుదల కానున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా కియారా అద్వానీ షోల్ మీడియాలో ఆసక్తికమర విషయాలను వెల్లడించింది. త్వరలో వాళ్లింట్లో పెళ్లి బాజా మోగనున్న సంగతి వెల్లడించింది. తన సిస్టర్కు పెళ్లి కుదిరిన విషయాన్ని కియారా ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. తన సిస్టర్కు అభినందనలు తెలియజేసింది. నా సోదరితో పాటు ఆమెకు కాబోయే వాడు ఇద్దరు ఆనందంగా ఉండాలని కోరకుంటున్నానంది. కాగా, హీరోయిన్ గా వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్న క్రమంలో ఈ బ్యూటీ 'లస్ట్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఏదైమైనా ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్న ఈ బ్యూటీ కెరీర్ స్టార్టింగ్ నుంచీ అగ్ర హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తూ దూసుకుపోతోంది.