సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కు పేరు మార్చుకున్నాక బాగా కలిసొచ్చింది.  సుప్రీమ్ తో కెరీర్ లో  మొదటి సారి సాలిడ్ హిట్ కొట్టిన  తేజు  ఆతరువాత ఏకంగా వరుసగా  6డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు.  దాంతో ఈ హీరో పనైపోయింది అనుకున్నారు అంతా..   అయితే ఆ తరువాత తేజు  ఈ ఏడాది చిత్ర లహరి తో  ప్రేక్షకులముందుకు వచ్చాడు.  ఈ చిత్రానికి  పేరు  మార్చుకొని మరీ అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.  టైటిల్ కార్డు లో సాయి ధరమ్ తేజ్ కాకుండా  సాయి తేజ్ అని  వేయించుకున్నాడు.   అయితే ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యింది.  ఈ చిత్రం  డీసెంట్  హిట్  అనిపించుకుని సాయి తేజ్ కు ఊరట నిచ్చింది.
 
 
ఇక ఈ చిత్రం తరువాత  అతను,ప్రతి రోజు పండగే  లో నటించాడు. ఈచిత్రానికి  కూడా ఆ సెంటిమెంట్ నే ఫాలో అయ్యాడు.  ఆ సెంటి మెంట్  ఈసారి ఇంకా బాగా  వర్క్ అవుట్ కావడంతో ఏకంగా కెరీర్ లో రెండో సాలిడ్ హిట్  ను  అందుకునేలా వున్నాడు. ఇటీవల విడుదలైన  ఈ చిత్రం  రివ్యూస్ తో సంబంధం లేకుండా  బాక్సాఫీస్ వద్ద  దుమ్ము లేపుతుంది. 5రోజుల్లో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 12.5కోట్ల షేర్ ను రాబట్టిందని సమాచారం. అలాగే యూఎస్ లో  300k పై చిలుకు  డాలర్లను  కలెక్ట్ చేసి  హాఫ్ మిలియన్  మార్క్ కు చేరువలో వుంది.  ఈరోజు క్రిస్మస్  కావడంతో ఈ  వసూళ్లు మరింతగా పెరగనున్నాయి.  ఇక ఈ వారం లో ఈసినిమా  బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి  ఫుల్ రన్ లో  బయ్యర్లకు మంచి లాభాలను తీసుకరానుంది. మారుతి డైరెక్షన్ లో పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన  ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా సత్యరాజ్ , రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: