సంచ‌ల‌నాల‌కు.. వివాదాల‌కు కేరాఫ్‌గా మారిన ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఇటీవల లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న వర్మ, తాజాగా మరో వివాదాస్పద చిత్రాన్ని తెరకెక్కించాడు. `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` సారీ సారీ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ పేరుతో ప్ర‌స్తుత రాజకీయ పరిస్థితులపై సెటైరికల్‌గా సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని రాబట్టలేకపోయింది అది వేరే విషయం అనుకోండి. ఇపుడు ‘ఎండర్ ది గర్ల్ డ్రాగన్’ మూవీతో పలకరించబోతున్నాడు. నూతన సంవత్సర కానుకగా ఈ  చిత్రాన్ని విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు వర్మ. 

 

ఇదిలా ఉంటే.. మొన్నటి మొన్న ‘బ్యూటిఫుల్’ ఆడియో‌లో డాన్సులు గట్రా చేసి తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. తాజాగా ‘బ్యూటిఫుల్’ ఆడియో వేడుకలో పలువురు నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు అంతే కొంటేగా సమాధానాలు ఇచ్చాడు ఆర్జీవి. ఒక నెటిజన్..శ్రీదేవి బయోపిక్ తీసే ఉద్దేశ్యం ఏమైనా ఉందా అని అడిగాడు. దానికి వర్మ.. శ్రీదేవిపై ఎలాంటి బయోపిక్ తీయను. అసలు శ్రీదేవి లాంటి అమ్మాయి దొరకడం అసాధ్యం అనే చెప్పాలి. మ‌రోవైపు ఓ నెటిజ‌న్ ఇక సినిమాలకు సమాజానికి ఎపుడు దూరంగా ఉంటారు అన్న ప్రశ్నుకు వర్మ.. నువ్వు చచ్చినపుడు నేను నువ్వు చెప్పినట్టుగానే సినిమాలకు, సమాజానికి దూరంగా ఉంటానని దిమ్మ దిరిగే సమాధానమిచ్చాడు. 

 

ఇది జరిగేటపుడు నువ్వు ఉండవు కాబట్టి ఇపుడే నేను నీకు నివాళులు అర్పించేస్తానన్నారు. అలాగే..  మీరు మరో గంటలో చనిపోతున్నారని తెలిస్తే.. ఏం చేస్తారనే ప్రశ్నకు .. స్వర్గంలో నాకు తెలిసినవారందరికీ ఫోన్ చేసి  శ్రీదేవి సమాధి ఎక్కడుందో తెలుసుకొని ఆమె పక్కనే నాకు స్థలం ఖాళీగా ఉంచమని చెప్తాను అంటూ సమాధానమిచ్చి అంద‌రికీ షాక్‌. ఇక‌ సినిమాలు, వోడ్కా...  ఈ రెండింట్లో దేన్ని ఒదిలేస్తారు.. అంటే నేను వోడ్కా తాగుతూ.. సినిమాలు తీస్తా.. అలాగే సినిమాలు తీస్తూ వోడ్కా తాగుతా.. నా దృష్టిలో ఆ రెండూ మ్యారీడ్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: