మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా ఈనెల 20న విడుదలైన ప్రతిరోజూ పండగే సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. మంచి కలెక్షన్లతో క్రిస్మస్ సీజన్ ను సెలబ్రేట్ చేసుకుంటోంది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీని సమపాళ్లలో పండించి దర్శకుడు మారుతి తన టాలెంట్ చూపించి సినిమాను హిట్ చేశాడు. ఇప్పటికే ఈ సినిమాపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ ప్రశంసలు కురిపించగా.. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ సినిమా విజయంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

 

 

బన్నీ తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ వేదికగా ప్రతిరోజూ పండగే సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ‘సినిమా విజయంపై టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు. నా కజిన్ సాయి తేజ్ కు మంచి హిట్ దక్కింది. నా ఫ్రెండ్ మారుతికి సక్సెస్ వచ్చింది. నా బెస్టీ బన్నీ వాసు ఖాతాలో మంచి సినిమా పడింది. ఇక మా నాన్న అల్లు అరవింద్ కు మరిన్ని లాభాలు తెస్తోంది. యూవీ ఫిలింస్ కు శుభాకాంక్షలు’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించగా, యూవీ సంస్థ కూడా భాగస్వామి అయింది. ప్రస్తుతం ఈ సినిమా మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది.

 

 

సాయి తేజ్ కు ఈ సినిమా వరంలా మారింది. మొన్న చిత్రలహరితో ఫ్లాప్స్ నుంచి గట్టెక్కి ఇప్పుడు ప్రతిరోజూ పండగేతో సక్సెస్ బాట పట్టాడు. మారుతి కూడా ఫ్లాప్ నుంచి గట్టెక్కాడు. గీతా ఆర్ట్స్ కు, యూవీ విజయపరంపర కొనసాగుతోంది. ప్రతి ఏరియాలో సినిమాకు మంచి రెస్పాన్స్ తో పాటు మంచి రెవెన్యూ తీసుకొస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: