ఎవరైన ఇంట్లో వాళ్ళ దగ్గర ఉన్నట్లు ఫ్రెండ్స్ దగ్గర ఉండలేరు.. అలానే ఫ్రెండ్స్ దగ్గర ఉన్నట్లు ఇంట్లో వాళ్ల దగ్గర ఉండలేరు. అయితే బహిరంగ వేదికలపైకి వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కన్న బిడ్డలు పక్కన ఉన్నప్పుడు మోటు మాటలు ఏ మాత్రం సరికావు. మెగా బ్రదర్ నాగబాబు తాజాగా ఇలాంటి తప్పే చేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు.

 

విషయంలోకి వెళ్తే.. జబర్దస్త్ నుంచి నాగబాబు జీతెలుగులో మొదలైన అదిరింది షోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఇటివలే ఈ కార్యక్రమం మొదలైంది. ఈ షోకు ఆదరణ బాగానే ఉన్నా.. తాజాగా టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో నాగబాబు తీరును తప్పు పడుతున్నారు. తాజా ఎపిసోడ్ కు నాగబాబుతో పాటు ఆయన కుమార్తె నిహారిక జడ్జిగా వచ్చారు. ఎప్పటిలానే షోలో డబుల్ మీనింగ్ డైలాగులు పేళాయి.. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు.

 


 చమ్మక్ చంద్ర తన స్కిట్ లో భాగంగా తన పెళ్లాం బాగాలేదని అంటాడు. మధ్యలో నాగబాబును.. బాబుగారు నా పెళ్లాం ఎలా ఉందంటే.. వెంటనే రియాక్ట్ అయిన నాగబాబు.. దానికేంట్రా కత్తిలా ఉందంటారు. పక్కన అంత పెద్ద కూతుర్ని పెట్టుకొని అలాంటి బూతుజోకులు వేయటం.. పడి పడి నవ్వటం ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెట్టంత కూతురు పక్కన పెట్టుకుని ఇలాంటి కామెంట్స్ ఏంటి సర్ అని నాగబాబుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

 

మొత్తంగా ‘అదిరింది’ షో చూస్తుంటే.. జబర్దస్త్ షోకు సీక్వెల్‌ల కనపడింది. మొత్తంగా కొత్త సీసాలో పాత సారా అన్నట్టు జబర్ధస్త్ షోలో కమెడియన్స్ గతంలో చేసిన స్కిట్సే మరలా ఈ కొత్త షో లో చేసి చూపించారు. ఈ షోలో తండ్రి నాగబాబుతో పాటు నిహారిక జడ్జ్‌గా వ్యవహరించింది. ఇక ప్రోగ్రామ్‌కు అనసూయ కాకుండా.. సమీరా యాంకరింగ్ చేస్తోంది. మొత్తంగా నాగబాబు ‘అదిరింది’ ప్రోగ్రామ్ ఏ మేరకు టీఆర్పీ సాధిస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజలు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: