యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత తన రేంజ్ పెంచుకున్నాడు. సాహో సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రొలీజైంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో సినిమా నిరాశ పరచినా బాలీవుడ్ లో మాత్రం సినిమా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ప్రభాస్ జాన్ సినిమా చేస్తున్నాడు. జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను కూడా యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.

 

జాన్ తర్వాత ప్రభాస్ ఎవరితో సినిమా చేస్తాడు అన్నది ఇంకా తెలియలేదు. శంకర్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని కొందరు అంటుంటే లేటెస్ట్ గా సందీప్ వంగతో ప్రభాస్సినిమా చేస్తాడని టాక్ వినిపిస్తుంది. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సందీప్ వంగ ఆ సినిమానే బాలీవుడ్ లో కబీర్ సింగ్ అంటూ తీసి మరో సెన్సేషనల్ హిట్ కొట్టాడు.

 

ప్రస్తుతం సందీప్ వంగ రణ్ బీర్ సింగ్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. అయితే ప్రభాస్ కోసం ఓ అద్భుతమైన కథ రాసుకున్నాడట. ప్రభాస్ ఓకే అంటే తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ సినిమా తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడు సందీప్ వంగ. సందీప్ చెప్పిన లైన్ నచ్చితే మాత్రం ప్రభాస్ అసలు వెనుకడుగు వేయడని చెప్పొచ్చు. సాహో అంచనాలను అందుకోకపోయినా జాన్ తో హిట్ కొట్టాలనే కసి మీద ఉన్నాడు ప్రభాస్.

 

ఇక సందీప్ వంగ సినిమా కూడా ఫిక్స్ అయితే మాత్రం మళ్లీ యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ అన్నట్టే. సందీప్ వంగ, ప్రభాస్ కాంబో సినిమా గురించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఇదే కాదు ప్రభాస్ ధూమ్ 4లో చేస్తాడన్న వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: