రాజ్ తరుణ్, షాలిని పాండే జంటగా జి.ఆర్ కృష్ణ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా ఇద్దరిలోకం ఒకటే. దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసిన ఆడియెన్స్ అంతా దిల్ రాజుకి ఈ మధ్య సినిమాల టేస్ట్ తెలియట్లేదని అనుకుంటున్నారు. ఇంత రొటీన్ స్టోరీని దిల్ రాజు ఎలా ప్రొడ్యూస్ చేశారా అని డౌట్ పడుతున్నారు.

 

ఇదిలాఉంటే ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా దిల్ రాజు ప్రొడక్ష స్టాండర్డ్స్ లేవని తెలుస్తుంది. సినిమా అనుకున్నప్పుడు ఏమో కాని సెట్స్ మీదకు వెళ్లాక దిల్ రాజుకి మధ్యలో డౌట్ వచ్చి ఉండొచ్చు అందుకే. సినిమాకు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ కేటాయించారని తెలుస్తుంది. కేవలం హీరో, హీరోయిన్ రెమ్యునరేషన్ తప్ప పెద్దగా ప్రొడక్షన్ కాస్ట్ పెట్టలేదని తెలుస్తుంది.

 

మాములుగా అయితే దిల్ రాజు తన ప్రతి సినిమా కథ విషయంలో జాగ్రత్త పడతాడు. కాని ఆ జాగ్రత్తలన్ని ఈ సినిమాకు పనికి రాలేదు. అంతేకాదు సినిమా రిలీజ్ ముందు కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ కు సినిమా చూపించి వారి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుని దాన్ని ప్రమోషన్స్ కు వాడుకున్నారు. కాని అవేవి సినిమాను కాపాడలేదు.

 

అయినా సినిమాలో మ్యాటర్ ఉండాలి కాని ఇలాంటి ప్రమోషన్స్ ఎన్ని చేసినా ఏముంటుంది చెప్పండి. ఇద్దరిలోకం ఒకటే.. రాజ్ తరుణ్ కెరియర్ లో మరో డిజాస్టర్ బొమ్మ అయ్యింది. షాలిని పాండే కెరియర్ మీద కూడా ఈ సినిమా ఎఫెక్ట్ పడేలా ఉంది. సరిలేరు నీకెవ్వరే సినిమాకు ముందు దిల్ రాజుకి ఈ సినిమా బాగా దెబ్బ వేసిందని చెప్పొచ్చు. ఇద్దరిలోకం ఒకటే సినిమాపై ముందునుండి పెద్దగా బజ్ లేదు ఈ టాక్ తో సినిమా దిల్ రాజు మరోసారి భారీ నష్టాలు తెచ్చేలా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: