మారుతి.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో సపరేట్ క్రేజ్ ఉంది. అనామకుడిగా ఇండస్ట్రీకి వచ్చి అసాధ్యుడిగా మారిపోయాడు ఈయన. ఈరోజుల్లో చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు దర్శకుడు మారుతి. దానికి ముందు పోస్టర్ డిజైనింగ్స్, మల్టీమీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈయన.. ఈ రోజుల్లో సినిమాతో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత బస్ స్టాప్ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే బూతు సినిమాల దర్శకుడిగా విమర్శలు కూడా అందుకున్నాడు. కానీ.. ఆ తర్వాత ప్రేమకథా చిత్రంతో అసలైన బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఆ విమర్శలను తుడిచేశాడు మారుతి. అక్కడ్నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ఇక తాజాగా మెగా మేనల్లుడు సాయి తేజ్ తో ప్రతి రోజూ పండగే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్నీ అందుకుంది. రాశీఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇదిలా ఉంటే మారుతి గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అదేంటంటే.. మారుతి నిర్మాత అల్లు అరవింద్ ఫ్యామిలీకి బంధువేనట. 2000లో బన్నీతో మారుతికి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి అరవింద్ ఇంట్లోనే తిరిగేవాడుట.
అలా పరిశ్రమని దగ్గర నుంచి చూడటం అలవాటైందన్నాడు. ఉద్యోగం చేసుకుంటూ బన్నీ వాళ్లతో కలిసి తిరిగేవాడుట. అప్పుడే అరవింద్ గారి భార్య తమకు బంధువు అవుతారని తెలిసిందట. అలా అల్లు ఫ్యామిలీకి బంధువు అయ్యాడు. ఇక మారుతికి అసలు దర్శకుడయ్యే ఉద్దేశమే లేదు. కానీ.. చిరంజీవి గారి ఆఫీస్ లో పనిచేయడంతో.. మారుతిలో ట్యాలెంట్ గుర్తించి నీలో క్రియేటిటీ ఉంది. నీలో దర్శకుడున్నాడు అంటూ ప్రోత్సహించడంతో మారుతి సినీ కెరీర్ మొదలైందట. ఇక ఏదేమైన ప్రస్తుతం టాప్ డైరెక్టర్లలో ఒకడిగా నిలిచాడుమారుతి.