టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతల్లో ఒకరు అల్లు అరవింద్. ఆయ‌న‌కు ముగ్గురు కొడుకులు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్‌లు. నిన్న అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ పుట్టినరోజు.  దీంతో అల్లు ఫ్యామిలీలో ఫుల్లుగా సందడి నెలకొంది.  కుటుంబ సభ్యులందరితో కలిసి సరదాగా గడుపుతూ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు అల్లు బాబీ. ఈ వేడుకల్లో స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ -స్నేహ రెడ్డి కూడా ఎంతో ఉత్సాహంగా ఈ ఫంక్ష‌న్‌లో ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ దిగారు. 

 

అల్లు బాబీ ఈ ఏడాది యోగా ట్రైనర్ నీలు షా ను రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.  ఆ మ‌ధ్య ఆ వివాహానికి అల్లుఅర్జున్ అటెండ్ కాలేద‌ని కొన్ని సోష‌ల్ మీడియాల్లో వార్త‌లు వినిపించాయి. మ‌రి ఈ సంద‌ర్భంగా క‌లిసినందుకు ఫ్యాన్స్ కుషీ అయిపోతున్నారు. ఈ ఫోటోలో అల్లు బాబీ - నీలు షా జంట.. అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి జంటతో కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకు పోజిలిచ్చారు. ఈ ఫొటో చూడ‌టానికి ఎంతో అందంగా ఉంది. స్టైలిష్ ఫ్యామిలీ అంటే వీళ్ళ‌దే అన్న‌ట్లు ఉంది.  అల్లు బాబీ డార్క్ కలర్ బ్లేజర్ ధరించి సాల్ట్ పెప్పర్ లుక్ లో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఇక స్టైలిష్ స్టార్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  ఇక అల్లువారి కోడ‌ళ్ళ విష‌యానికి వ‌స్తే మోడ్ర‌న్ ఫ్యామిలీకి పెట్టింది పేరు అన్న‌ట్లు ఉన్నారు.

 

ఇక అల్లు బాబీ ఈమధ్యే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న చిత్రంతో బాబీ నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరి ఫ్యూచర్లో పూర్తి స్థాయిలో గీతా ఆర్ట్స్ బాధ్యతలు చేపడతారేమో వేచి చూడాలి.

 

 ఒకప్పుడు వేగంగా సినిమాలు నిర్మించిన అల్లు అరవింద్.. ఇప్పుడు కాస్త నెమ్మదించారు. అధిక సమయం తన తనయుల అభివృద్ధిపైనే దృష్టి పెట్టారు. ఇటీవల 70వ వసంతంలోకి అడుగుపెట్టిన ఆయన.. ఇదే సరైన తరుణం అని భావించి అన్ని పనులు తన కొడుకులకు అప్పగించాలని భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: