సెలబ్రిటీలు ఏది చేసినా  సెన్సేషనే... ఇక పండగ వచ్చిందంటే మన సెలబ్రిటీలు చేసే హంగామా మామూలుగా ఉండదు. పలువురు సినీనటులు పండగ సందర్భంగా  ఫొటోలు షేర్‌ చేస్తూ అభిమానులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్బంగా  టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ‘ఈ పండగకు ఇచ్చిపుచ్చుకోవడంలో ఉన్న ప్రేమను, అనుభూతిని ఆస్వాదించండి, నచ్చినవారితో కలిసి ఈ పండగను ఎంజాయ్‌ చేయండి. వీలైనన్ని జ్ఞాపకాలను కూడగట్టుకోండి’ అని  అభిమానులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపాడు. ఇక తన మనవరాళ్లతో కలిసి మెగాస్టార్‌ చిరంజీవి  విషెస్‌ క్రిస్మస్‌తోపాటు నూతన సంవత్సర విషెస్‌ కూడా తెలిపాడు. తన తండ్రి చిరుతో కలిసి పండగ వేడుకల్లో  హీరో రామ్‌చరణ్‌ కూడా పాల్గొన్నాడు.


 ప్రత్యుష ఫౌండేషన్‌ పిల్లలతో కలిసి హీరోయిన్‌ సమంత క్రిస్మస్‌ వేడుకలు జరుపుకుంది. ‘ఎవరైతే తమ జీవితాల్లో వెలుగు కోసం ఎదురుచూస్తారో వారితో కలిసి క్రిస్మస్‌ను సెలబ్రేట్‌ చేసుకున్నప్పుడే ఆ పండగకు పూర్తి అర్థం ఉంటుంద’ని సమంత పేర్కొంది. పిజ్జాతో క్రిస్మస్‌ను  మరో నటి కేథరిన్‌ సెలబ్రేట్‌ చేసుకుంది.

 

హీరోయిన్‌ రెజీనా సాంటాక్లాజ్‌లా రెడీ అయినది .. తనకు డిసెంబర్‌ నెల ఎంతో ప్రత్యేకమని ఆమె చెప్పుకొచ్చింది. తన పుట్టినరోజు(డిసెంబర్‌ 13), క్రిస్మస్‌, ఈ నెలలోనే రానున్న కొత్తసంవత్సరం కోసం ప్రారంభమయ్యే వేడుకలు అన్నీ  జరుగుతాయని, అందుకే ఈ నెల తనకెంతో ఇష్టమని పేర్కొంది. అయితే ఈ సంవత్సరం ఎంతో బిజీగా ఉన్నా పండగ జరుపుకోవడం మాననంటోంది.

 

ఈ సందర్బంగా మంచు మనోజ్‌ ‘ఈ క్రిస్మస్‌ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎన్నో సంతోషాలను, ప్రేమను, అదృష్టాలను అందించాలని కోరుకుంటున్నాను’ అని విషెస్‌ తెలిపాడు. నిర్మాత, నటి మంచు లక్ష్మీ అభిమానులకు క్రిస్మస్‌ పండగ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబంతో కలిసి ఈ పండగను ఆస్వాదించండన్నారు. ఇక జూ. ఎన్టీఆర్‌, ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, కాజల్‌ అగర్వాల్‌ పలువురు నటీనటులు క్రిస్మస్‌ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: