ఒకప్పుడు స్టార్ దర్శకుల్లో ఒకరిగా ఉన్న శ్రీను వైట్ల కొంత కాలంగా వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్నారు.  ఒకదశలో హీరోలు ఆయనతో సినిమాలంటేనే భయపడిపోతున్నారు. కెరీర్ బిగినింగ్ లో చలసాని రామారావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.  రవితేజ, మహేశ్వరి కాంబినేషన్ లో వచ్చిన నీకోసం మూవీ మంచి హిట్ అయ్యింది.  ఆ తర్వాత శ్రీను వైట్లపై  దర్శకత్వంలో వచ్చిన ఆనందం, సొంతం, ఢీ, దుబాయ్ శీను, రెడీ, దూకుడు, బాద్ షా ఇలా వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.  ఇక మహేష్ బాబు తో తీసిన ఆగడు మూవీ తర్వాత మనోడికి వరుస పరాజయాలు వచ్చాయి. రామ్ చరణ్ తో బ్రూస్ లీ, రీసెంట్ గా రవితేజ తో తీసిన అమర్ అక్బర్ ఆంథోని మూవీ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.  ఒక మంచి హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు శ్రీను వైట్ల.  ఇక స్టార్ ప్రొడ్యూసర్ అయిన బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘అల్లుడు శీను’ మూవీతో సూపర్ హిట్ అయ్యింది.  

 

ఆ తర్వాత మనోడి బ్యాడ్ లక్ ఒక్క సినిమా కూడా హిట్ టాక్ రాలేదు.  ఆ మద్య వచ్చిన రాక్షసుడు కాస్త పరవాలేదు అనిపించింది. బెల్లంకొండ శ్రీనివాస్ కూడా చాలా పరాజయాలు చూసి ఈమధ్యే హిట్ అందుకుని ఇప్పుడు సంతోష్ శ్రీనివాస డైరెక్షన్లో కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ పూర్తి కాగానే శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ మూవీలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఈ విషయంపై ఈ ఇద్దరు ఎలాంటి స్పందన తెలపలేదు. 

 

వరుస పరాజయాల్లో ఉన్న దర్శకుడు శీను వైట్ల గత ప్రయత్నం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ కూడా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయిన విషయం తెలిసిందే.  హీరోలెవరూ ఆయనతో వర్క్ చేయడానికి సుముఖంగా లేరనేది ఇండస్ట్రీ టాక్. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయనతో ఒక యంగ్ హీరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడట. మరి ఈ ఇద్దరికీ ఒకవేళ కుదిరితే ఆ మూ హిట్ అయితేనే కలిసి వస్తుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: