బాహుబలి  సిరీస్ తో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు  దర్శకుడు  ధీరుడు రాజమౌళి. దాంతో  ఆయన  తదుపరి చిత్రం పై అంచనాలు  తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక ప్రస్తుతం  రాజమౌళి ,టాలీవుడ్  అగ్ర హీరోలు  యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో  'ఆర్ఆర్ఆర్'. అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈచిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాగా  కొద్దీ రోజుల క్రితం  ఆరుకు  ప్రాంతం లో కొన్ని  కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక  ఈ చిత్రం  ప్రీ రిలీజ్ బిజినెస్  విషయం లో సరికొత్త రికార్డులను  నెలకొల్పుతుంది. 
 
తూర్పు గోదావరి జిల్లాకు  గాను ఈ సినిమా థియేట్రికల్ హక్కులను 13కోట్లకు అమ్మారు.  గీత మరియు షణ్ముఖ ఫిలిమ్స్ భారీ పోటీ నడుమ  ఈ హక్కులను  దక్కించుంది.  అక్కడ ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం  ఇదే మొదటి సారి. దీన్ని బట్టి  అర్ధం చేసుకోవచ్చు  ఈ చిత్రానికి ఎలాంటి క్రేజే ఉందో. ఈలెక్కన  తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 300కోట్లప్రీ రిలీజ్ చేసిన  ఆశ్ఛర్య పోనవసరం లేదు. 
 
పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో  సుమారు 300 కోట్ల బడ్జెట్ తో  తెరకెక్కుతున్న  ఈ చిత్రంలో చరణ్ కు జోడిగా అలియా భట్ నటిస్తుండగా   ఎన్టీఆర్ కు కు జోడిగా  హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్  నటించనుంది. స్వాతంత్య్ర  సమర యోధులు   అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత  చరిత్రలను బేస్ చేసుకొని రూపొందుతున్న ఈచిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం గా అలాగే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు.  వీరితో పాటు  బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ , సముద్రఖని ముఖ్యమైన పాత్రల్లోనటిస్తున్నారు.  భారీ బడ్జెట్ తో దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రానికి  కీరవాణి సంగీతం అందిస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: