భారతీయ సినిమాలంటే.. అశ్లీలతకు చోటులేకుండా.. చాలా చక్కగా ఉంటాయనే అభిప్రాయం ఒకప్పుడు ఉండేది. కానీ హాలీవుడ్ సినిమాల ప్రభావం వల్ల నెమ్మదిగా బాలీవుడ్‌కు లో కూడా 'బోల్డ్' సినిమాల పిచ్చి పట్టుకుంది. దాంతో హీరోయిన్లు నగ్నంగా నటించేందుకు కూడా వెనకాడటం లేదు. ఒకప్పుడు తమ సినిమాకు 'ఎ' సర్టిఫికెట్ వచ్చిందంటే దర్శక నిర్మాతలు ఆందోళనతో గగ్గోలు పెట్టేవాళ్ళు. నగ్నత్వం, హింసా వివాదాస్పద సినిమాలకు సెన్సార్ అనుమతి ఇచ్చేది కాదు. దీంతో చాలా వరకు సినిమాలు విడుదలయ్యోవి కాదు. అలాంటి వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే విదేశాల్లో విడుదలై.. ఆన్‌లైన్ ద్వారా ఇండియాకు చేరుకుంటున్నాయి. పాత్ర డిమాండ్ చేయాలేగానీ.. నగ్నంగా చేయడానికి కూడా సిద్ధమేనని నేటి హీరోయిన్లు ప్రకటిస్తున్నారు. తాజాగా తమిళం, తెలుగులో విడుదలైన 'ఆమె' సినిమాలో అమలాపాల్ నగ్నంగా నటించి ఆశ్చర్యపరిచింది. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే.. తెలుగులో 'లెజెండ్', 'లయన్', 'రక్తచరిత్ర' సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన రాధికా అప్టే కూడా నగ్నంగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు రాధిక రెండు సినిమాల్లో నగ్నంగా నటించింది. 

 

1970లో నగ్న సన్నివేశాలతో ప్రేక్షకులకు షాకిచ్చిన తొలి హీరోయిన్ సిమీ గారెవాల్. ఆమె నటించిన 'మేరా నామ్ జోకర్', 'సిద్ధార్థ' సినిమాల్లో పూర్తిగా నగ్నంగా కనిపించింది. ఇక 1993లో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ హీరోగా నటించిన 'మాయా మేమ్‌సాబ్' సినిమాలో దీపాసహీ నగ్నంగా నటించింది. టాప్ లెస్ సీన్లో దీపా, షారుక్ ఖాన్‌లు రెచ్చిపోయి మరీ నటించారు. 2008లో విడుదలైన 'రంగ్ రసియా' సినిమా అప్పట్లో వివాదాస్పదంగా మారింది. చిత్రకారుడు.. రాజారవి వర్మ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమాలో 48 ఏళ్ల నందన సేన్ తన ఎద అందాలను ప్రదర్శించింది. 2014లో విడుదలైన 'ద ఎక్స్‌పోజ్' అనే సినిమాలో సోనాలీ రౌత్.. జీనత్ అమన్ తరహాలో ఎద అందాలు కనిపించేలా తెల్ల చీర కట్టుకుని ట్రైలర్‌లో కనిపించింది. అయితే, సినిమా ఎప్పుడు విడుదలైందో.. ఎప్పుడు పోయిందో కూడా తెలియలేదు. 2005లో సీమా రహమనీ, షిదే అహుజా జంటగా నటించిన 'సిన్స్' సినిమా విడుదలవనేలేదు. ఈ సినిమాలో సీమా కొన్ని నగ్న సన్నివేశాల్లో నటించింది.

 

1978లో విడుదలైన 'సత్యం శివం సుందరం' సినిమాలో హీరోయిన్ జీనత్ అమన్ ఓ ఛాలెంజింగ్ పాత్ర చేసింది. అందులో లోదుస్తులు లేకుండా కేవలం చీరను మాత్రమే ధరించి ఎద అందాలను ఆరబోసింది. నేటి తరం హీరోయిన్లు ఎన్నిరకాలుగా అందాలు ఆరబోసినా.. జీనత్ అమన్ అందాల ముందు తక్కువేనని బాలీవుడ్ అభిమానులు అంటుంటారు. 1985లో విడుదలైన 'రామ్‌ తేరీ గంగా మైలీ' సినిమాలో హీరోయిన్ మందాకినీ పూర్తిగా నగ్నంగా కనిపించకపోయినా.. పలుచని చీరలో తన ఎద అందాలను ఆరబోసింది. పసివాడికి చనుబాలు ఇచ్చే సన్నివేశంలో కూడా నటించింది. 'దొంగ దొంగ' సినిమాతో తెలుగు, తమిళ సినిమాలకు పరిచమైన అను అగర్వాల్.. 1994లో 'ద క్లౌడ్' అనే సినిమాలో తన ఎద అందాలను ఆరబెట్టింది.

 

'రక్త చరిత్ర' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాధిక ఆప్టే ఆ తర్వాత బాలకృష్ణతో 'లయన్', 'లెజండ్' సినిమాల్లో నటించింది. మరోవైపు బాలీవుడ్‌లో సైతం బిజీగా మారిన రాధికా.. 'పర్చెడ్', 'వెడ్డింగ్ గెస్ట్' సినిమాల్లో నగ్నంగా నటించింది. ఇక తెలుగు సినిమాలో.. నటి, డ్యాన్సర్ రమ్య స్వయంగా నిర్మించి, నటించిన 'ఓ మల్లి' సినిమా విజయం సాధించలేదు. ఈ చిత్రంలో ఆమె తన ఎద కనిపించేలా వస్త్రధారణ చేసింది. 1981లో విడుదలైన నిరీక్షణ సినిమాలో నటి అర్చన కూడా బోల్డ్ సన్నివేశాల్లో కనిపించింది. అయితే ఇలా నటించినందుకు కొంతమంది వీళ్ళని ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని డిమాడ్ చేస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఇది కూడా ఒక కళేనని, తాము ఏం చేసినా అది తమకు అన్నం పెట్టే పరిశ్రమ కోసమే చేశామని చెబుతున్నారు. సహజత్వం కోసం అలాంటి సన్నివేశాలు ఉండాలని వాదిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: