పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, తొలిసినిమా తోనే మంచి సక్సెస్ ని తన అకౌంట్ లో వేసుకున్నాడు. అనంతరం మాస్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన సుప్రీం సినిమాల అద్భుత విజయాలతో కెరీర్ పరంగా మంచి పేరు దక్కించుకున్నాడు. ఇక అక్కడి నుండి తేజ్ కు ఆఫర్లు విపరీతంగా రావడం మొదలయ్యాయి. అయితే అదే ఊపులో వరుసగా ఆయన నటించిన ఆరు సినిమాలు కూడా ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. ఇక ఇటీవల కొంత గ్యాప్ తీసుకుని తేజ్ నటించిన చిత్రలహరి సినిమా

 

ఎట్టకేలకు కెరీర్ పరంగా ఆయనకు మంచి బ్రేక్ ని అయితే ఇచ్చింది. ఇక కొద్దిరోజుల క్రితం తేజు లేటెస్ట్ మూవీ ప్రతిరోజు పండగే ప్రేక్షకుల ముందుకు వచ్చి, ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ టాక్, కలెక్షన్స్ తో దుమ్మురేపుతోంది. ఈనెల 20న రిలీజ్ అయిన ఈ సినిమా, మెజారిటీ ప్రాంతాల్లో అత్యధిక కలెక్షన్ తో దూసుకుపోతోంది. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా ఫ్యామిలోని బంధాలు, అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. యువ దర్శకుడు మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా, కీలక పాత్రల్లో రావు రమేష్, సత్య రాజ్ నటించారు. 

 

ఇకపోతే సినిమా రిలీజ్ అయి ఐదు రోజులు గడుస్తున్నప్పటికీ కూడా, ఓవర్ ఆల్ గా ఇప్పటికీ 80 శాతానికి పైగా కలెక్షన్ ని ఎక్కువ ప్రాంతాల్లో రాబడుతోందని, అలానే మరొక రెండు రోజుల్లో ఈ సినిమా లాభాల బాట కూడా పట్టనున్నట్లు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ఆ సినిమాతో పాటు రిలీజ్ అయిన రూలర్, దొంగ, దబాంగ్ 3 సినిమాలు పెద్దగా టాక్ ని దక్కించుకోకపోవడంతో మెజారిటీ ప్రేక్షకులు ప్రతి రోజు పండగే సినిమా వైపు చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ సినిమా భారీగానే లాభాలు దక్కించుకునే పరిస్థితి కనపడుతోందట.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: