సౌత్ సినీ ఇండస్ట్రీ లోని అందాల తారలలో ఒకరైన రష్మిక కొద్దిరోజుల్లోనే తన స్టార్ డంని విపరీతంగా పెంచేసుకుంది. రష్మిక 2016 లో కిరిక్ పార్టీ చిత్రం ద్వారా కన్నడ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. చమక్, గీతా గోవిందం మొదలైన చిత్రాలలో ఆమె నటించి బాగా ప్రసిద్ది చెందింది. ఇటీవల, తన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు యొక్క డబ్బింగ్ పనులను పూర్తి చేసింది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక రొమాన్స్ చేసింది. జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ సహకారంతో ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రామబ్రహ్మం సుంకర నిర్మించిన సరిలేరు నీకెవ్వరికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.


ఈ చిత్రంలో "లేడీ అమితాబ్" విజయశాంతి ఒక దశాబ్దం తరువాత తిరిగి మళ్ళీ సినిమాలో ఎంట్రీ ఇచ్చారు. రష్మిక చివరిసారిగా డియర్ కామ్రేడ్‌లో కనిపించింది, ఇందులో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా లిల్లి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే, ఈ చిత్రంలోని ఆమె నటన ప్రతిభకు గానూ బిహైండ్ వుడ్స్ వారు అవార్డు ప్రకటించారు. సో, డియర్ కామ్రేడ్ కోసం 'ఉత్తమ నటి (విమర్శకులు ఛాయిస్) గోల్డ్ మెడల్ అవార్డు ని అందుకునేందుకు రష్మిక ఇటీవల చెన్నైలో బిహైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్స్ 2019 కు హాజరయ్యింది.


ఈ అవార్డు ఫంక్షన్ లో రష్మిక చాలా అందంగా కనిపించి అందరి చూపులను తనవైపే తిప్పుకుంది. ఇంకా హోస్టు అడిగిన అన్ని ప్రశ్నలకు తెలివిగా సమాధానం ఇచ్చింది. ప్రఖ్యాత 'ఫ్రెండ్, లవ్ & మారీ' ఆటకు స్పందించిన రష్మిక ఇలా సమాధానం చెప్పింది: "స్నేహం? విజయ్ దేవరకొండ, ప్రేమ? విజయ్ సేతుపతి, వివాహం? విజయ్ తలపతి!" ఈ ముద్దుగుమ్మ కేవలం విజయ్ పేరు గల ముగ్గురి హీరోల పేర్లు చెప్పడం చర్చనీయాంశం అయింది. మిగతా ఇద్దరికి ఆల్రెడీ పెళ్లయింది కాబట్టి ప్రేమించడానికి, పెళ్ళి చేసుకోవడానికి సరైన వాడు విజయ్ దేవరకొండ అని ఆమె పరోక్షముగా చెప్పిందంటూ నెటిజన్లు ఊహాగానాలు చేసుకుంటున్నారు. ఈ 'విజయ్' పేరు ఆమె స్మరించడంలో తప్పనిసరిగా ఏదో అంతరార్థం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు రష్మిక అభిమానులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: