‘రూలర్’ మూవీ ఘోర పరాజయంతో తీవ్ర అసహనంలో ఉన్న బాలకృష్ణ అభిమానులకు నిన్న విడుదలైన ‘మత్తు వదలరా’ మూవీలోని కొన్ని సీన్స్ బాలయ్య అభిమానులకు తీవ్ర కోపాన్ని తెప్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కీరవాణి కొడుకు శ్రీ సింహా హీరోగా పరిచయం అయిన ఈ మూవీలో సీనియర్ ఎన్టీఆర్ ను బాలకృష్ణను టార్గెట్ చేసే విధంగా కొన్ని సీన్స్ ఉన్నాయని బాలయ్య అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. 

మూవీ దర్శకుడు రితేష్ కు చిరంజీవి అంటే బాగా అభిమానం ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ సినిమా చిరంజీవి ప్రస్తావనతో మొద‌ల‌వుతుంది. చిరుతో ఇంట్ర‌వెల్ ఇచ్చాడు చిరుని చూపించే సినిమాని ముగించాడు. అంతేకాదు చిరంజీవి పాత సినిమాలలోని బిట్లను ఈ మూవీలో చూపించాడు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఇదే సమయంలో ఈ మూవీలో పలు చోట్ల బాలయ్యను సీనియర్ ఎన్టీఆర్ లను కామెడీ చేసే విధంగా సీన్స్ ఉండటంతో ఈ విషయాలు బాలయ్య అభిమానుల దృష్టి వరకు వచ్చాయి.

ముఖ్యంగా బాలకృష్ణ పై జోక్స్ వేస్తూ కామెడీ పండించే ప్రయత్నం ఈ మూవీలో దర్శకుడు చేసాడు. దీనితో ఈ యంగ్ డైరెక్టర్ తన మొదటి సినిమాతోనే ఇటువంటి వివాదాలలోకి ఎందుకు వెళ్ళాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే ఈ సీన్స్ చూసిన బాలయ్య అభిమానులు మండిపోతున్నారు. 

వాస్తవానికి రాజమౌళి కీరవాణి లకు బాలయ్యతో మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే ఈ ఇద్దరి పర్యవేక్షణలో నిర్మాణం జరుపుకున్న ఈమూవీలో ఇలాంటి సీన్స్ ఏమిటి అంటూ బాలయ్య అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. సమకాలీన యువతలో ఉండే భావోద్వేగాలను కథాంశంగా తీసుకుని మర్డర్ ఎపిసోడ్స్ డ్రగ్స్ లాంటి అంశాలకు తోడు ఊహించని ట్విస్టులతో రూపొందించిన ఈమూవీకి టాక్ బాగా రావడంతో పాటు  రివ్యూలు కుడా బాగా వచ్చిన నేపధ్యంలో కీరవాణి కొడుకు మొదటి పరీక్షలో నెగ్గాడు అన్న వార్తలు వస్తున్నాయి. రితేష్ రానా ఎంచుకొన్న పాయింట్ కథను నడిపించిన విధానంకు యూత్ బాగా కనెక్ట్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: