వరుస పరాజయాలతో  కొనసాగుతున్న  యంగ్ హీరో  రాజ్ తరుణ్..తాజాగా  'ఇద్దరి లోకం ఒకటే' తో మరో సారి తన  అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే ఎలాంటి అంచనాలులేకుండా  నిన్న విడుదలైన  ఈచిత్రం పూర్ రివ్యూస్  ను అలాగే  నెగిటివ్  టాక్ ను రాబట్టుకోవడంతో  మొదటి రోజు ఈ చిత్రం   తెలుగు రాష్ట్రాల్లో  డిజాస్టర్ ఓపెనింగ్ ను రాబట్టింది.  ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ నుండి వచ్చిన చిత్రం కావడంతో థియేట్లరు బాగానే దొరికాయి కానీ సినిమాలో విషయం లేకపోవడం తో  మొదటి షో నుండే తేలిపోయింది. దాంతో ఈ చిత్రం 50లక్షల  షేర్ ను కూడా  రాబట్టలేదని  సమాచారం. నైజాం లో 22లక్షల షేర్  ఉత్తరాంధ్ర లో కేవలం 4లక్షల షేర్ ను రాబట్టింది.  లవ్ స్టోరీ నేపథ్యంలో కృష్ణా తెరక్కించిన ఈ చిత్రంలో  అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే హీరోయిన్ గా నటించగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.  కాగా ఈచిత్రం తో రాజ్ తరుణ్ కెరీర్ లో వరుసగా  7వ డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు. 
 
 ఇక రాజ్ తరుణ్ ప్రస్తుతం  గుండె జారి గల్లంతయ్యిందే ఫేమ్  విజయ్ కుమార్ కొండా డైరెక్షన్ లో ఒరేయ్ బుజ్జిగా అనే చిత్రంలో నటిస్తున్నాడు.  రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న  ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా   మాళవిక నాయర్  కథానాయికగా నటిస్తుంది.  శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కేకే రాధామోహన్  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.  వచ్చే ఏడాది సమ్మర్ లో ఈచిత్రం విడుదలకానుంది. 
 
ఈసినిమాను  పూర్తి చేసిన తరువాత రాజ్ తరుణ్ డ్రీం గర్ల్ రీమేక్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు.  ఆలాఎలా ఫేమ్ అవిష్ కృష్ణ  డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: