టెలివిజన్ రంగంలో కలర్స్ ప్రోగ్రామ్ లో తనదైన స్టైల్లో స్టార్స్ ని ఇంటర్వ్యూ చేస్తూ అందరి చూపు తనవైపు తిప్పుకుంది కలర్స్ స్వాతి.  చిన్నతనంలోనే పెద్ద స్టార్స్ ని తనదైన ఫన్నీ స్టైల్లో ఇంటర్వ్యూలు తీసుకుంటూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది. కృష్ణవంశి దర్శకత్వంలో ‘డేంజర్’మూవీతో నటిగా వెండి తెరకు తొలిపరిచయం అయ్యింది.  తర్వాత నాని హీరోగా నటించిన ‘అష్టాచమ్మ’ మూవీతో హీరోయిన్ గా మహేష్ బాబుకి హార్డ్ కోర్ ఫ్యాన్ గా నటించి మెప్పించింది.  2008 లో ఈ సినిమాకు ఆమెకు నంది పురస్కారం లభించింది. ఈ సినిమాతో అటు నానికి ఇటు స్వాతికి బాగా కలిసి వచ్చింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే హీరోయిన్లకు డబ్బింగ్ చెబుతూ పాటలు కూడా పాడింది. వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే మూవీలో స్వాతి నటన అందరినీ ఆకర్షించింది.

 

 తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించి ప్రజల మన్నలను అందుకుంది.  మాలీవుడ్ లో స్వాతి నటించిన సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి.  ఇక నిఖిల్ హీరోగా నటించిన ‘స్వామిరారా’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లోనే కార్తికేయ వచ్ిచంది  ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది.  చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ‘కార్తికేయ’ మూవీ బిగ్గెస్ట్ హిట్ సినిమాగా చెప్పొచ్చు. దర్శకుడిగా ఈ సినిమా చందూ మొండేటికి మంచి గుర్తింపు తీసుకురావడమే కాకుండా, నిఖిల్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమా జాబితాలో నిలిచింది.

 

 ఇక ఈ మూవీలో స్వాతి డాక్టర్ గా నటించింది. ఇటీవల మలేసియన్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్‌ వికాస్‌తో ఆమె వివాహం జరిగింది.  అయితే మంచి కథ ఉంటే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. ఈ నేపథ్యంలోనే ‘కార్తికేయ’ సీక్వెల్ ప్లాన్ లో ఉన్నారు.  అయితే ఈ సీక్వెల్లో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ పేరు వినిపిస్తోంది. అయితే ఈ మూవీలో మరో కీలకమైన పాత్రలో కలర్స్ స్వాతి కనిపించబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్. ఈ మూవీకి విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: