దర్శకుడు రాజమౌళి తన కొడుకు కార్తికేయను దర్శకుడుగా కన్నా నిర్మాతగా సెటిల్ చేయాలని ఎప్పటినుంచో ఆలోచిస్తున్నాడు. వాస్తవానికి కార్తికేయకు దర్శకత్వం పై అభిరుచి ఉన్నా ‘బాహుబలి’ లోని కొన్ని సీన్స్ కార్తికేయ సొంతంగా తీసినా రాజమౌళి ఆలోచనలు మటుకు తన కొడుకుని టాలీవుడ్ టాప్ నిర్మాతగా చూడాలని ఉబలాట పడుతున్నాడు. 

ఇలాంటి ఆలోచనలతో కార్తికేయ కొన్ని సినిమాలకు సమర్పకుడుగా వ్యవహరించినా ఆ సినిమాలు పెద్దగా విజయవంతం కాలేదు. దీనితో రాజమౌళి ఆలోచనలు ఇంకా కలలుగానే మిగిలిపోయాయి. ఇలాంటి పరిస్థితులలో నిన్న విడుదలైన ‘మత్తు వదలరా’ మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో తిరిగి రాజమౌళిలో ఆశలు మొదలైనట్లు టాక్.

తెలుస్తున్న సమాచారం మేరకు కీరవాణి శ్రీ సింహాను హీరోగా పెట్టి విజయేంద్ర ప్రసాద్ చేత కథ వ్రాయించి కార్తికేయను నిర్మాతగా చేయడమే కాకుండా ఆ మూవీలో కార్తికేయ చేత ఒక అతిథి పాత్ర చేయించే రాజమౌళి ఫ్యామిలీ మూవీకి కూడ కౌంట్ డౌన్ మొదలైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘మత్తు వదలరా’ మూవీ ప్రమోషన్ లో ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ శ్రీ సింహా ఇచ్చిన లీకులను బట్టి ఈ వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటి వరకు అక్కినేని దగ్గుబాటి నందమూరి ఘట్టమనేని ఫ్యామిలీ సినిమాలను తెలుగు ప్రేక్షకులు చూసారు. త్వరలో రాజమౌళి కుటుంబ ఫ్యామిలీ మూవీని కూడ చూడబోతున్నారు అని ఇప్పుడు వస్తున్న వార్తలను బట్టి అనుకోవాలి. అయితే ఈ ఫ్యామిలీ మూవీ ఆలోచనలు వాస్తవ రూపం దాల్చాలి అంటే రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ బిజీ అయిన తరువాత మాత్రమే వాస్తవ రూపం దాల్చే అవాకసం కనిపిస్తోంది. ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు పొందిన ‘మత్తు వదలరా’ మూవీ ఈ వీకెండ్ అయ్యేంత వరకు ప్రేక్షకుల మత్తును వదిలించి ధియేటర్లకు రప్పించు కోగలిగితే కీరవాణి కొడుకు కూడ ప్రేక్షకుల పరీక్షలో సక్సస్ అయినట్లే అనుకోవాలి..    

మరింత సమాచారం తెలుసుకోండి: