టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటి అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతాయని తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్ గా ‘అలా వైకుంఠపురములో’ నటిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి సంబంధించి ‘సామ జవర గమనా’, ‘రాములో రాములా’ సాంగ్స్ యూట్యూబ్ షేక్ చేశాయి. ‘సామ జవర గమనా’ సాంగ్ అయితే ఏకంగా రికార్డుల మోత మోగించింది. త్రివిక్రమ్ తన సినిమా కథపై ఎంతగా ఫోకస్ పెడతారో.. సాంగ్స్ పై కూడా అంతే ఫోకస్ పెడతారు.
ప్రతిసాంగ్ ఆయన పర్యవేక్షణలోనే సాగుతుంది. గతంలో అల్లు అర్జున్ నటించిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి మూవీ సాంగ్స్ మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇక అలా వైకుంఠపురములో అయితే ఏకంగా రిలీజ్ కి ముందే సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఈ మూవీలో టబు ముఖ్యపాత్రలో కనిపించబోతుంది. తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు, నటుడు సముద్రకని కీలకపాత్ర లో కనిపిస్తున్నారు. గతంలో తమిళ హీరో ధనుష్ నటించిన విఐపి, విఐపి 2 లో నటించాడు. తాజాగా అలా వైకుంఠపురములో సముద్రకని కి సంబంధించిన సీన్లు హైలెట్ గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ మద్య రిలీజ్ అయిన టీజర్లో సముద్రకని కార్ దిగుతూ ఇచ్చిన హావభావాలు అనుకరిస్తూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. సముద్రకనితో ‘మీరు ఇప్పుడే కారు దిగారు.. నేనిప్పుడే క్యారెక్టర్ ఎక్కా.. అంటూ బన్నీ కొట్టే డేలాగ్ హైలెట్ గా ఉంది. అయితే ఇది ఒక్కటే కాదు ఇలాంటి సముద్రకని, అల్లుఅర్జున్ ల మధ్య వచ్చే సన్నివేషాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయట.