రాబోయే సంక్రాంతి కానుకగా టాలీవుడ్ లో మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో ముఖ్యంగా మూడు బడా హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న దర్బార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అలవైకుంఠపురములో, సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు, కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఎంత మంచివాడవురా సినిమాలు మంచి క్రేజ్ తో సంక్రాంతి బరిలో నిలుస్తున్నాయి. 
అయితే ఎక్కువగా ఆడియన్స్ యొక్క దృష్టి ఎక్కువగా సరిలేరు నీకెవ్వరు,

 

అలవైకుంఠపురములో సినిమాలపైనే ఉందని తెలుస్తోంది. ఎందుకంటే బన్నీ త్రివిక్రమ్ ల కాంబోలో ఇదివరకు వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు సక్సెస్ సాధించాయి, దానితో ప్రస్తుతం వారు కలిసి చేస్తున్న మూడవ సినిమా అయిన అలవైకుంఠపురములో కూడా సక్సెస్ సాధించి, వారి కాంబోలో హ్యాట్రిక్ క్రియేట్ చేయడం ఖాయం అని బన్నీ ఫ్యాన్స్ భావిస్తుంటే, ఇటీవల మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను, మహర్షి సినిమాలు రెండు కూడా అతి పెద్ద హిట్స్ నమోదు చేయడంతో, తప్పకుండా ఈసారి సరిలేరుతో కూడా మరొక హిట్ ని మహేష్ అందుకుని హ్యాట్రిక్ సొంతం చేసుకుంటారని మహేష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

 

అదిమాత్రమే కాక, కెరీర్ పరంగా ఒక్క అపజయం కూడా ఎదురుకాని అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు కావడం వారి నమ్మకానికి మరొక కారణం. మరోవైపు రెండు సినిమాలు కూడా ప్రమోషన్ విషయమై దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. జవనరీ 5న సరిలేరు ప్రీ రిలీజ్ వేడుక జరగనుండగా, ఆ వేడుకకు మెగాస్టార్ ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నారు. కాగా అలవైకుంఠపురములో యూనిట్ కూడా ఇద్దరు టాలీవుడ్ బడా హీరోలను తమ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఆహ్వానించేలా ప్లాన్ చేసిందని, అతి త్వరలో పూర్తిగా వివరాలు మీడియాకు వెల్లడి అవుతాయని కొన్ని టాలీవుడ్ వర్గాల సమాచారం. మరి సంక్రాంతికి జరుగబోయే ఈ భీకర బాక్సాఫీస్ పోరులో వీరిద్దరిలో ఎవరు విజేతగా నిలుస్తారో తెలియాలంటే మరికొద్దిరోజలు ఓపిక పట్టాల్సిందే......!!  

మరింత సమాచారం తెలుసుకోండి: