ఒకప్పుడు సినిమాలంటే.. కథ కథనం వీటన్నిటీ కలగలపి మంచి మంచి ఆర్టిస్టులతో తెరకెక్కేవి. అప్పటి కథలకు మంచి ఆదరణ ఉండేది. అప్పటి హీరోయిలన్లకు ఓ చక్కటి అందం, అభినయం గుర్తింపు ఉండేది. అప్పట్లో హీరోయిన్లు కళ్ళతోనే భావాలన్నీ పలికించేవాళ్ళు. వారికట్టు బొట్టు ప్రతిదీ అందర్నీ ఆకర్షించేవి. హీరోయిన్లు నిండుగా చీర కట్టుకున్నా ఎంతో అందంగా కనిపించేవారు. దానికి కారణం వాళ్ళు పోషించే పాత్ర కూడా అంతే బలంగా ఉండేది. వాళ్ళ ప్రతిభనంతా నటనలోనే ఎంతో చక్కటి భావాలను పలికిస్తూ ప్రేక్షకులను అలరించేవారు. హీరోయిన్లు ధరించే వస్త్రాలుగాని, సినిమాలో చిత్రీకరించే సన్నివేశాల్లో ఎక్కడా అశ్లీలతకు తావులేకుండా ఉండేవి.
అట్లాంటిది ఈ మధ్య సినిమాలు రూట్ మారింది. బోల్డ్ కంటెంట్, బోల్డ్ వ్యవహారం ఫలితంగా హీరోయిన్లు నగ్నంగా నటించేందుకు కూడా వెనకాడటం లేదు. ఫైనల్గా సినిమాలకు `ఎ` సర్టిఫికెట్. ఒకప్పుడు సెలవలు వచ్చాయంటే చాలు సరదాగా ఇంట్లో కుటుంబ సమేతంగా వెళ్ళేది ముందు సినిమాలకే కాని ఇప్పుడు సినిమాలు అలా లేవు. ఇంట్లో అందరూ కలిసి చూసే సినిమాలు లేవు. సినిమాల్లో అశ్లీలత ఎక్కువైపోయింది. అప్పట్లో `ఎ`సర్టిఫికెట్ సినిమాలంటేనే నిర్మాతలు భయపడేవారు సెన్సార్ సర్టిఫికెట్ రావడం కష్టమని తెగ మదన పడేవారు. నగ్నత్వం, హింసా వివాదాస్పద చిత్రాలకు సెన్సార్ అనుమతి రావాలంటేనే చాలా కష్టమని ఇలాంటి వాటికి తావులేకుండా సినిమాలను తీసేవారు.
కానీ ఇప్పుడు అలా లేదు. పాత్ర డిమాండ్ చేయాలేగానీ.. నగ్నంగా చేయడానికి కూడా సిద్ధమేనని నేటి హీరోయిన్లు ప్రకటిస్తున్నారు. తాజాగా తమిళం, తెలుగులో విడుదలైన ‘ఆమె’ సినిమాలో అమలాపాల్ నగ్నంగా నటించి ఆశ్చర్యపరిచింది. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే.. తెలుగులో ‘లెజెండ్’, ‘లయన్’, ‘రక్తచరిత్ర’ సినిమాల్లో హీరోయిన్గా నటించిన రాధికా అప్టే సైతం వలువలు విడిచి, నగ్నంగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఒక్కసారి కాదు, ఏకంగా రెండు సినిమాల్లో నగ్నంగా నటించింది. ఈమె మాత్రమే కాదు.. కొన్ని దశాబ్దాల కిందట కూడా పలువురు హీరోయిన్లు నగ్నంగా నటించి వైరల్గా మారారు. ఇప్పటికీ వారి నగ్న సన్నివేశాలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి.
1970లో ప్రేక్షకుల నగ్న సన్నివేశంతో పిచ్చెక్కిచ్చిన హీరోయిన్ సిమీ గారెవాల్. ఆమె నటించిన ‘మేరా నామ్ జోకర్’, ‘సిద్ధార్థ’ సినిమాలో పూర్తిగా నగ్నంగా కనిపించింది. 1993లో బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ హీరోగా నటించిన ‘మాయా మేమ్సాబ్’ సినిమాలో దీపాసహీ నగ్నంగా నటించింది. టాప్ లెస్ సీన్లో దీపా, షారుక్ ఖాన్లు రెచ్చిపోయి మరీ నటించారు. అలాగే 2008లో విడుదలైన ‘రంగ్ రసియా’ సినిమా అప్పట్లో వివాదాస్పదంగా మారింది. చిత్రకారుడు.. రాజారవి వర్మ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమాలో 48 ఏళ్ల నందన సేన్ తన స్తనాలను ప్రదర్శించింది. తెలుగు సినిమాల విషయానికి వస్తే.. నటి, డ్యాన్సర్ రమ్య స్వయంగా నిర్మించి, నటించిన ‘ఓ మల్లి’ సినిమా విజయం సాధించలేదు. ఈ చిత్రంలో ఆమె తన యెద కనిపించేలా వస్త్రధారణ చేసింది. 1981లో విడుదలైన నిరీక్షణ సినిమాలో నటి అర్చన కూడా బోల్డ్ సన్నివేశాల్లో కనిపించింది. వీళ్ళు కావాలని ఏమీ చెయ్యలేదని సహజత్వం కోసం అలాంటి సన్నివేశాలు ఉండాలని చెబుతున్నారు.