విశాల్-సమంత హీరో హీరోయిన్స్ గా నటించిన అభిమన్యుడు సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుందో అందరికి తెలిసిందే. ఈ సినిమాతో టాలీవుడ్ లోనూ డైరెక్టర్ మిత్రన్ పేరు మార్మోగిపోయింది. ఇక ఇటీవలే హీరో సినిమాతోను మరో బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ప్రస్తుతం విశాల్ హీరోగా 'అభిమన్యుడు' సీక్వెల్ పై వర్క్ చేస్తున్నారు ఈ క్రేజీ తమిళ డైరెక్టర్. అటుపై కార్తీ హీరోగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కి సన్నాహాలు చేస్తున్నారు. అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్ లో వరుస విజయాలు సాధిస్తూ బాక్సాఫీస్ చియాన్ గా మారిన కార్తీతో మిత్రన్ సినిమాకి సన్నాహాలు చేస్తున్నాడు.  

 

ఇటీవల వరుస విజయాలు అందుకుంటున్న కార్తీకి ఇది కెరీర్ పరంగా ప్లస్ కానుందనే అంచనా వేస్తున్నారు. అంతేకాదు రాను రాను అన్న సూర్య కే పోటీ అవుతున్నాడని కోలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తోంది. మొన్న 'ఖైదీ' గా- నిన్న ‘దొంగ’గా బ్లాక్ బస్టర్స్ సాధించిన కార్తి డిమాండ్ తెలుగు మార్కెట్లోనూ బాగానే పెరిగింది. ఆ డిమాండ్ కి తగ్గట్టే క్రేజీ డైరెక్టర్ మిత్రన్ తో ఇంకో సినిమా చెయ్యడానికి రెడీ అయిపోతున్నాడు.

 

'అభిమన్యుడు' తర్వాత శివకార్తికేయన్ 'హీరో' తో మరో బ్లాక్ బ్లస్టర్ అందుకున్న డైరెక్టర్ పి.యస్.మిత్రన్ ఇప్పటి నుంచి కార్తి ప్రాజెక్టుపై వర్క్ చేయనున్నాడు. ఆల్రెడీ మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'పొన్నియన్ సెల్వన్' లో కార్తీ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మిత్రన్ సినిమాకి కమిటయ్యాడు. మణిరత్నం సినిమా షూటింగ్ పూర్తయ్యాక మిత్రన్ సినిమా షూటింగ్ లో జాయినవుతాడట. ఇక ప్రస్తుతం కార్తీ చేస్తున్న ఈ ప్రాజెక్ట్స్ అన్నీ సూపర్ హిట్ అయితే గనక ఇక అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో తిరుగులేదని అంటున్నారు. ఇక కార్తి తన సినిమాలకి వరుసగా మెగాస్టార్ చిరంజీవి గతంలో నటించిన సినిమా టైటిల్స్ ని పెట్టుకోవడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. అంతేకాదు మెగాస్టార్ టైటిల్ కార్తి కి బాగా కలిసొస్తున్నాయన్న టాక్ కూడా కార్తి కి ఉత్సాహాన్ని ఇస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: