యాంకర్ లాస్య అంటే ఆ పక్కనే రవి ఉండాలి. అలా ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వీరి లైఫ్ చాలా హ్యాపీగా సాగింది. లైఫ్ హ్యాపీగా సాగడమే కాదు. సక్సెస్ ఫుల్ యాంకర్స్ గా వీరు విజయం సాధించారు. అయితే, కొన్ని కారణాల వలన రవి, లాస్య విడిపోయారు. ఇలా ఇద్దరు విడిపోయిన తరువాత పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. రవి ఏదోలా నెట్టుకొస్తుండగా, లాస్య మాత్రం యాంకర్ గా సోలోగా సక్సెస్ కాలేకపోయింది. రెండేళ్ల క్రితం మంజునాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యింది.
ఇలా వివాహం చేసుకొని సెటిల్ అయ్యాక ఓ బిడ్డకు తల్లి అయ్యింది. పెళ్లి తరువాత మహిళలు లావు అవుతారు. ఇది కామన్. అందరిలానే లాస్య కూడా లావు అయ్యింది. ఇలా ఇంతకాలం ఇంట్లోనే ఉన్న లాస్యకు బోర్ కొట్టిందేమో సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంది. తనకు సంబంధించిన వీడియోలను ఆ ఛానల్ లో పెడుతూ తిరిగి పాపులర్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నది.
ఈ సమయంలోనే యాంకర్ లాస్యకు ఓ ఐడియా వచ్చింది. వెంటనే భర్త ప్రోత్సాహంతో చకచకా పనులు మొదలు పెట్టింది. ఇంతకీ ఆ ఐడియా ఏంటి అని అంటారా. ఇంకేముంది కుకరీ ప్రోగ్రాం. ఇటీవలే క్రిస్మస్ సందర్భంగా స్పెషల్ చికెన్ ను తయారు చేసింది. అలా తయారు చేసిన చికెన్ ను యూట్యూబ్ ఛానల్ లో పెట్టింది. చాలా కాలం తరువాత యాంకర్ లాస్య ఛానల్ లో కనిపించడంతో అందరు షాక్ అయ్యారు.
గతంలో కంటే లావుగా ఉన్నది. యూట్యూబ్ ఛానల్ కాబట్టి ప్రాబ్లెమ్ లేదు. పైగా సొంత ఛానల్. అంతకంటే కావాల్సింది ఏముంటుంది. వెంటనే లాస్య షేర్ చేసిన వీడియోకు లైక్స్, వ్యూస్ వచ్చిపడ్డాయి. క్రిస్మస్ చికెన్ సక్సెస్ కావడంతో లాస్య తిరిగి వీడియోలు చేయాలనీ నిర్ణయం తీసుకుందట. దీనినే ఆమె తన ఫుల్ టైమ్ బిజినెస్ గా మార్చుకున్నట్టు తెలుస్తోంది. లాస్య కుకరీ ఛానల్ సక్సెస్ కావాలని కోరుకుందాం. ఒకవేళ మళ్ళీ తనకు యాంకర్ గా అవకాశం వస్తే తప్పకుండా యాంకరింగ్ చేస్తానని అంటోంది ఈ అమ్మడు.