కన్నడ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకున్న హీరోయిన్ రష్మిక మందన టాలీవుడ్ ఇండస్ట్రీలో గీతా గోవిందం సినిమా తో ఎంట్రీ ఇచ్చి మొట్టమొదటి సినిమాతోనే అదిరిపోయే హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా బన్నీ మరియు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మాస్ మసాలా ప్రాజెక్ట్ సినిమాలో కూడా ఇటీవల ఛాన్స్ దక్కించుకుంది. ప్రొఫెషనల్ గా సక్సెస్ఫుల్ జర్నీ కొనసాగిస్తున్న రష్మిక మందన పర్సనల్ లైఫ్ లో తన పెళ్లి ఆగిపోయిన సంఘటన ఒక మిస్టరీగా మీడియాలో సోషల్ మీడియాలో మిగిలిపోవడం తో ఆమెకు ఈ విషయంపై చాలా సార్లు ప్రశ్నలు ఎదురుకావడం జరిగాయి.

 

విషయంలోకి వెళితే అప్పట్లో కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో ప్రేమలో పడి పెళ్లి దాకా వెళ్లి నిశ్చితార్థం దగ్గర కొన్ని అనివార్య కారణాలవల్ల ఆగిపోయింది. ఇటువంటి తరుణంలో తాజాగా ఇంటర్వ్యలో రక్షిత్ ను ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన విషయాన్ని ప్రస్తావిస్తే 'కొన్ని విషయాలను మర్చిపోవడమే మంచిది' అని స్పందించాడు.  తాజాగా ఒక ఇంటర్వ్యూలో రష్మికకు ఇలాంటి ప్రశ్నే ఎదురయింది.

 

దీనికి సమాధానం ఇస్తూ మొదట్లో ఇద్దరం ఒకరిని ఒకరు ఇష్టపడ్డామని అందుకే వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నామని తెలిపింది. అయితే ఇద్దరికి సినిమాలో రాణించాలనే కోరిక ఉందని.. అందుకే పెళ్లిని రెండేళ్లు వాయిదా వేసుకున్నామని తెలిపింది. ప్రస్తుతం ఫుల్లు అవకాశాలతో కెరియర్ కొనసాగుతోందని ఇటువంటి సమయంలో నిర్మాతలను ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం తనకు లేదని అందుకనే సినిమాల కోసమే అతని వదిలేసినట్లు పెళ్లి గురించి ఇప్పుడు అప్పుడే ఊసు ప్రసక్తి లేదన్నట్లు క్లారిటీ ఇచ్చింది రష్మిక మందన. ప్రస్తుతం రష్మిక మందన "సరిలేరు నీకెవ్వరు" సినిమా పాటల షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: