తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి అనే సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాడాయన. ఈ ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా రాజమౌళి పేరు చర్చనీయాంశం అయిపోయింది. ఈ సినిమానే కాదు.. అంతకు ముందు ఆయన చేసిన ప్రతి సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నదే. ఇక రాజమౌళికి తోడుగా అతని అన్నయ్య కీరవాణి ఎప్పటికి వెన్నంటే ఉంటారు.

 

 

వారి మధ్య ఎలాంటి ఆత్మీయ అనుబంధం ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకూ తను డైరెక్ట్ చేసిన సినిమాలన్నిటికీ కీరవాణి నే  మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకుంటూ వచ్చాడు రాజమౌళి. అసలు కీరవాణి లేని రాజమౌళి సినిమాను చూడలేం అన్నట్టు గా ఆడియన్స్ కి ఎక్కేసింది ఈ కాంబో. ఇకపోతే ఇప్పుడు వీళ్ళ నెక్స్ట్ జెనేరేషన్ నుండి మరో కాంబో గా రెడీ అవుతున్నారు.. అదేమంటే రాజమౌళి కొడుకు కీరవాణి కొడుకులు కలిసి ఓ సినిమా చేయాలనే ప్లాన్ ఉంది.

 

 

లేటెస్ట్ గా 'మత్తు వదలరా' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన సింహ ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు. కార్తికేయ కి నన్ను హీరోగా పెట్టి అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్ లో ఒక సినిమా నిర్మించాలని ఉంది. అయితే అదెప్పుడు చేస్తామో మాత్రం తెలియదు అంటూ తెలిపారు.

 

 

ఇకపోతే ఇప్పటికే శ్రీ సింహా రాజమౌళి దర్శకత్వం వహించిన యమదొంగ సినిమాలో చిన్నప్పటి హీరో పాత్రలో నటించాడు. ఆ తర్వాత వివిధ శాఖలలో పనిచేసి ఇప్పుడు మత్తు వదలరా సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇక కార్తికేయ లాగే జక్కన్నకి కూడా తమ పిల్లలతో సినిమా తీయాలనే ఆలోచన వస్తే జక్కన్న ఫ్యామిలీ ఇప్పటి నెక్స్ట్ జెనరేషన్ ఇండస్ట్రీ లో సెట్ అయినట్టే అని అనుకుంటున్నారట సినీ ప్రియులు. ఇక ప్రస్తుతం 'మత్తు వదలరా' తో పాజిటీవ్ టాక్ అందుకొని రెండో సినిమాకి రెడీ అవుతున్నారు  కీరవాణి కొడుకులు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: