సూపర్ స్టార్ మహేష్ బాబు, కెరీర్ మొదట్లో కొంత రిజర్వుడుగా ఉండేవారు. అయితే రాను రాను తన పంథాను మార్చుకున్న సూపర్ స్టార్, మెల్లగా ఫ్యాన్స్ తో బాగా మమేకం అవడం మొదలెట్టారు. ఇక ఆ తరువాత నుండి పలు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వారికి అందుబాటులో ఉంటూ, తన సినీ, వ్యక్తిగత విషయాలు పంచుకుంటున్న మహేష్, తన లైఫ్ లో ఫ్యామిలీ తో పాటు అభిమానులు కూడా ఎంతో ముఖ్యం అని, వారు కూడా తమ ఫ్యామిలీలో భాగమని చెప్తుంటారు. 

 

ఇక కొన్నాళ్ల క్రితం భరత్ అనే నేను సినిమా షూటింగ్ సమయంలో ఫ్యాన్స్ తో కలిసి ప్రత్యేకంగా ఫోటో షూట్ లో పాల్గొన్న మహేష్, మళ్ళి రెండేళ్ల తరువాత ప్రస్తుతం హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతం వద్ద గల అల్యూమియం ఫ్యాక్టరీ ఏరియాలో ఫ్యాన్స్ తో కలిసి ఫోటోలు దిగేందుకు సిద్ధం అయ్యారు. అతి త్వరలో రిలీజ్ కానున్న మహేష్ తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ తరువాత ఫ్యాన్స్ తో కలిసి ఈ ఫోటో షూట్ లో పాల్గొంటున్న మహేష్, నిన్న వారి మధ్య కొద్దిపాటి తొక్కిసలాట జరుగడంతో, సరిలేరు నిర్మాతలు ఈ రోజు అటువంటివి మళ్ళి జరుగకుండా పొలిసు వారి సహాయంతో ఎంతో ప్రశాంతంగా ఫోటో షూట్ నిర్వహించారు. 

 

ఇక ఈ ఫోటో షూట్ కోసం వేలాదిగా ఫ్యాన్స్ అల్యూమినియం ఫ్యాక్టరీ వద్దకు తరలి రావడం జరిగింది. టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్న మహేష్ క్రేజ్, ఫ్యాన్స్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆయనను చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ ని చూస్తుంటే ఎవరికైనా మతి పోవడం ఖాయం అనే చెప్పాలి. గంటలు గడిచినా ఫ్యాన్స్  వరుసగా వస్తూ ఉన్నప్పటికీ కూడా సూపర్ స్టార్ మహేష్ మాత్రం ఎంతో సహనంతో సౌమ్యంగా వారితో కలిసి ఫోటోలు దిగడం ఎంతో సంతోషంగా ఉందని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: