కన్నడ భామ రష్మిక మందన్న వెంకీ కుడుములు దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ఛలో అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయింది. అయితే మొదటి సినిమాతోనే మంచి హిట్ సాధించడంతో పాటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న రష్మికకు, ఆ తరువాత విజయ్ దేవరకొండ సరసన నటించిన గీత గోవిందం సూపర్ హిట్ కావడంతో మరింత క్రేజ్ దక్కించుకుంది. ఇక అక్కడినుండి రష్మిక, టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ప్రస్తుతం నితిన్ సరసన భీష్మ, సూపర్ స్టార్ మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరుతో పాటు అల్లు అర్జున్

 

సుకుమార్ ల కాంబినేషన్లో అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న మూవీ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది ఇక తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కూడా ఎప్పుడూ తన ఫ్యాన్స్ ఎంతో సరదాగా వ్యవహరించే రష్మిక, నేడు తమిళ నాడులో జరిగిన ఒక ఈవెంట్ లో ప్రత్యేకంగా సందడి చేసింది. బిహైండ్ ద వుడ్స్ వారు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న రష్మిక, అందులో భాగంగా ఒకింత తమిళ భాషలో మాట్లాడడం, అలానే సూపర్ స్టార్ రజినీకాంత్ వలె స్టైల్ గా నడవడం వంటివి చేసి, అందరినీ ఉర్రూతలూగించింది. ఇక అదే సమయంలో యాంకర్ తనతో కలిసి మూడు చిట్టీలు తీయించగా వాటిలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, ఇళయదళపతి విజయ్

 

అలానే విజయ్ సేతుపతి పేర్లు వచ్చాయి. కాగా వారు ముగ్గురిలో మీరు ఎవరిని ఫ్రెండ్ గా ఎంచుకుంటారు, ఎవరిని ప్రేమిస్తారు, అలానే ఎవరిని పెళ్లి చేసుకుంటారు అని యాంకర్ అడగ్గా. ముందుగా విజయ్ దేవరకొండని తన ఫ్రెండ్ గా, విజయ్ సేతుపతిని లవర్ గా, అలానే ఇళయదళపతి విజయ్ ను పెళ్లి చేసుకుంటానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. అబ్బో రష్మిక ఆశలు మాములు ఆశలు మాములుగా లేవే అంటూ, పలువురు నెటిజన్లు ఆమెపై తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫన్నీ గా కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: