పడి పడి లేచె మనసు ,రణరంగం తో వరసగా రెండు  డిజాస్టర్లను ఖాతాలో వేసుకున్న ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ వచ్చే ఏడాది  ఏకంగా మూడు సినిమాలతో  ప్రేక్షకులముందుకు రానున్నాడు. అందులో భాగంగా ఇటీవలే శర్వా , 96 తెలుగు రీమేక్ ను పూర్తి చేశాడు.  జాను అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రంలో  శర్వాకు జోడిగా  సమంత నటించగా  ఒరిజినల్ వెర్షన్  డైరెక్టర్ ప్రేమ్  కుమార్  తెరకెక్కిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్  బ్యానర్ పై  దిల్ రాజు నిర్మిస్తున్న ఈచిత్రం  వచ్చే ఏడాది ఫిబ్రవరి లో విడుదలకానుంది. 
 
ఇక  శర్వా ప్రస్తుతం  శ్రీకారం అనే చిత్రంలో నటిస్తున్నాడు.  నూతన దర్శకుడు  కిషోర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో  గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్  హీరోయిన్ గా నటిస్తుంది. రైతుల  సమస్యల నేపథ్యం లో  రూపొందుతున్న  ఈ చిత్రాన్ని  14రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపిచంద్ ఆచంట నిర్మిస్తుండగా మిక్కీ జె మేయర్  సంగీతం అందిస్తున్నాడు.  ఈచిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది.  
 
ఈచిత్రం  తోపాటు శర్వా , తమిళ డైరెక్టర్  శ్రీ కార్తీక్ తో కూడా  ఓ సినిమా చేస్తున్నాడు.  ద్విభాషా చిత్రం గా  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో   రీతూ వర్మ, శర్వా కు జోడీగా నటిస్తుంది.  ప్రముఖ కోలీవుడ్  నిర్మాణ సంస్థ డ్రీం వారియర్ పిక్చర్స్  నిర్మిస్తున్న ఈ చిత్రానికి  టాక్సీవాలా ఫేమ్  జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.  ఇక ఈ చిత్రానికి పెళ్లి చూపులు డైరెక్టర్  తరుణ్ భాస్కర్ మాటలు రాస్తుండడం విశేషం. ఈ చిత్రం కూడా  వచ్చే ఏడాది విడుదలకానుంది. ఇవి  కాకుండా  ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్ లో  కూడా నటించడానికి  శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. త్వలోనే ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ రానుంది. 
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: