బాహుబలి సిరీస్ విజయవంతం అయిన తరువాత, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సౌత్ ఇండస్ట్రీ స్టార్ నుంచి ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగాడు. తన లేటెస్ట్ సినిమా సాహో లో నటించిన ప్రభాస్, ప్రస్తుతం కొన్ని మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. నిజానికి, తన రాబోయే చిత్రాలతో పాటు, ప్రభాస్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఒక ఆసక్తికరమైన అంశంగానే ఉంటుంది. అతను ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్. అందుకే, అతని వివాహం, ప్రేమ జీవితం గురించి అభిమానులు బాగా చర్చించుకుంటున్నారు. అయితే, కొంత కాలం క్రితం ప్రభాస్ అనుష్క శెట్టితో లవ్వాయణం సాగిస్తున్నాడని పుకార్లు వచ్చాయి, కాని ప్రభాస్ పుకార్లని ఖండిస్తూ ఆ వార్తలు అవాస్తమని చెప్పారు.


తాజా నివేదికల ప్రకారం, ప్రభాస్ తన రాబోయే చిత్రం జాన్ తర్వాత వివాహం చేసుకోవాలని యోచిస్తున్నాడట. ఆ విషయం అతని పెద్దమ్మ శ్యామల దేవి వెల్లడించింది. ప్రభాస్ పెళ్లి విషయంపై పెదవి విప్పిన ఆమె 2020 సంవత్సరంలో జాన్ చిత్రం విడుదలైన తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకోవాలని యోచిస్తున్నట్లు ఆమె వెల్లడించింది. అయితే, వధువు గురించి ఆమె ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.


"మేము ప్రభాస్ వివాహం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాము. అతని వివాహం, వధువుపై నాన్-స్టాప్ పుకార్లు వస్తుంటే మేము నవ్వలేకపోతున్నాం . మాది ఒక పెద్ద కుటుంబం, స్వేచ్ఛగా ఉండి మాతో కలిసిపోయే సరైన అమ్మాయి కోసం దొరకాలని మేము చూస్తున్నాము," అని శ్యామల చెప్పుకొచ్చింది.

ఇకపోతే, సాహో యొక్క ప్రమోషన్ల సందర్భంగా, ప్రభాస్ తన వివాహ పుకార్లపై స్పందిస్తూ, “ఇది నా ప్రైవేట్ విషయం. నేను ఏమీ వెల్లడించడానికి ఇష్టపడను.” అని చెప్పాడు. ప్రభాస్ 2020 లో తన పెళ్లి చేసుకుంటాడని మీరు అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: