2014 సంవత్సరంలో విడుదలైన కార్తికేయ చిత్రంలో నిఖిల్, స్వాతి రెడ్డి ప్రధాన పాత్రలలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా సుపరిచితుడయ్యాడు చందూ మొండేటి. అయితే ఈ సినిమా సీక్వెల్ ని అదే డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కిస్తున్నాడట. కార్తికేయ చిత్రం విడుదలైన ఐదేళ్ల తరువాత, దర్శకుడు దాని కోసం ఒక సీక్వెల్ ప్లాన్ చేసి.. నిఖిల్, స్వాతి రెడ్డి ని లీడ్ రోల్స్ లో నటించేందుకు గాను వీళ్ళిద్దరిని తీసుకున్నారు. అయితే, కొత్తగా ఈ సీక్వెల్ లో రాక్షసుడు సినిమాలో అలరించిన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా, స్వాతి ఒక రిపోర్టర్ రోల్ పోషిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తికేయ 2 యొక్క షూటింగ్ ని జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించాలని యోచిస్తున్నారు.



ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లోని ప్రదేశాలను సినిమా షూటింగ్ కోసం ఎంచుకున్నారు డైరెక్టర్. చిత్ర బృందం త్వరలో అక్కడకు వెళుతుంది. హీరో నిఖిల్ ఈ ప్రాజెక్ట్ కోసం చాలా హోంవర్క్ చేస్తున్నాడట. అతని కెరీర్లో మొదటిసారి సిక్స్ ప్యాక్ బాడీ తో నటించే సినిమా ఏదంటే అది కార్తికేయ 2 సినిమానే. తెలుగులో నిర్మించబోయే కార్తీకేయ 2 తమిళం, హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. 2014 లో విడుదలైన మిస్టరీ థ్రిల్లర్ కార్తికేయ చిత్రానికి చందూ మొండేటి రచన, దర్శకత్వం వహించారు.



మాగ్నస్ సినీ ప్రైమ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వెంకట్ శ్రీనివాస్ దీనిని నిర్మించారు. ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్, స్వాతి రెడ్డి, తనికెల్లా భరణి, రావు రమేష్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు, కార్తీక్ ఘట్టమనేని, కార్తికా శ్రీనివాస్ కెమెరా పనిని, ఎడిటింగ్‌ను చేశారు. ఈ దర్శకుడు చివరి చిత్రం సవ్యసాచి. ఈ మూవీ లో నాగ చైతన్య, నిధి అగర్వాల్ నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: