సంక్రాంతి కోడి పందాలను మించి జరుగుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ మూవీల మధ్య జరగబోతున్న వార్ కు సంబంధించి జనవరి 11న  మహేష్ వస్తుంటే జనవరి 12న బన్నీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ రాజీ మార్గాన్ని కుదర్చడానికి దిల్ రాజ్ ఎంతో చాకకాక్యంగా వ్యవహరించి మహేష్ బన్నీల ఇగో లకు తగ్గట్టుగా వారితో మాట్లాడి వారిద్దరినీ ఒప్పించాడు అన్న మాటలు ఉన్నాయి. 

అయితే ఇప్పుడు కుదిరిన ఈ రాజీ అనుకోకుండా ‘సరిలేరు నీకెవ్వరు’ భారీ ఓపెనింగ్స్ కు సహకరిస్తుందా అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. ఈ మూవీ జనవరి 11న విడుదల కాబోతున్న పరిస్థితులలో మన తెలుగు రాష్ట్రాలలో అత్యధిక దియేటర్లలో ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదల కాబోతోంది. 

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని చిన్న పట్టణాలు అయిన ఏలూరు తాడేపల్లిగూడెం భీమవరం లాంటి ఊళ్ళల్లో జనవరి 11న ఆ ఊరిలో ఉండే అన్ని ధియేటర్స్ లోను మహేష్ సినిమాను ప్రదర్శిస్తారు అని తెలుస్తోంది. ఆ మరునాడు జనవరి 12న ‘అల వైకుంఠపురములో’ మూవీ కోసం  కొన్ని ధియేటర్ల నుండి మహేష్ సినిమాను తీసివేసినా మొదటిరోజున ‘సరిలేరు’ కు వచ్చినన్ని థియేటర్స్ ‘అల వైకుంఠపురములో’ కు మొదటిరోజు దక్కవు అన్నప్రచారం జరుగుతోంది. 

ఇది ఇలా ఉండగా ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీమియర్ షోలకు అమెరికాలో టికెట్ కు 21 డాలర్ల ధరను నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ కు ఓవర్సీస్ లో ఉన్న క్రేజ్ రీత్యా అమెరికాలోని డల్లాస్ క్యాలిఫోర్నియ న్యూజెర్సీ లతో పాటు అనేక ప్రాంతాలలో జనవరి 11న ప్రీమియర్ షోలు వేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు ఆదివారం కంటే శనివారం సినిమాలను చూడటానికి ఇష్టపడతారు. ఈ కారణం వల్ల జనవరి 11 శనివారం కావడంతో పాటు జనవరి 10వ తారీఖు రాత్రి ఈసినిమాకు వేసే ప్రీమియర్ షోలతో మొదటిరోజు ఓపెనింగ్ కలెక్షన్స్ ఫిగర్స్ విషయంలో మహేష్ మూవీ బన్ని మూవీ పై స్పష్టమైన అదిపత్యాని ప్రదర్శిస్తూ బన్ని సినిమా కంటే ఒక రోజు ముందుగా విడుదల అవుతున్న నేపధ్యంలో ‘సరిలేరు నీకెవ్వరు’ ఓపెనింగ్స్ విషయంలో సంచనాలు సృష్టిస్తుంది అంటూ జరుగుతున్న ప్రచారం బన్నీకి ఊహించని షాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: