తెలుగు హిందీలో విభిన్న పాత్రల్లో నటిస్తూ వస్తున్న హిరోయిన్ దీపిక పదుకొనె.. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న ఈ  ముద్దుగుమ్మ హీరో రణబీర్ సింగ్ ను వివాహమాడిన విషయం తెలిసిందే.. అయితే పెళ్లయ్యాక భర్తతో కలిసి సినిమాలు చేస్తుందన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈమె యాసిడ్ బాధితురాలు పాత్రలో చపాక్ అనే చిత్రంలో నటిస్తోంది..


చిత్రీకరణ పూర్తి చేసుకొని సెన్సార్ బోర్డు గడప ఛపాక్’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ప్రజలకు బాగా చేరువైన టీవీ షోల ద్వారా తన చిత్రాన్ని ప్రచారం చేసుకునే పనిలో ఉన్నారామె. ఈ క్రమంలో తాజాగా డ్యాన్స్ రియాలిటీ షో ‘డ్యాన్స్ ప్లస్’లో ఆమె పాల్గొన్నారు. ఈ షోలో దీపికాకు ఒక ఎమోషనల్ మూమెంట్ ఎదురైంది. దానితో దీపిక కన్నీళ్లు ఆపుకోలేక లైవ్ అనే సంగతి కూడా మర్చిపోయి కన్నీటి పర్యంతమయ్యారు..


కేవలం 33ఏళ్లకే సినిమాలలో సువర్ణాక్షరాలతో లిఖించిన దిపీక ఎన్నో విభిన్న పాత్రల్లో నటించారు.. వాటిని కంటెస్టెంట్స్ ఈ సాంగ్స్ ప్రదర్శిస్తున్నంత సేపు చాలా ఆసక్తిగా, భావోద్వేగానికి గురవుతూ చూసిన దీపికా పదుకొనే.. ఆఖరి పాటకు వచ్చేటప్పటికి కన్నీటిని ఆపుకోలేకపోయారు. తన రెండు చేతులూ ముఖానికి అడ్డంగా పెట్టుకుని ఏడ్చేశారు. ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తోన్న రెమో డిసౌజా భుజంపై వాలిపోయి బోరుమన్నారు దీపికా. దీంతో ప్రేక్షకులంతా పైకి లేచి దీపికా.. దీపికా.. అంటూ నినాదాలు చేశారు.


ఈ మేరకు దీపికా మాట్లాడుతూ.. ‘‘నేను ఇప్పటి వరకు చాలా షోల్లో పాల్గొన్నాను. కానీ, ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదు. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మాత్రం చెప్పగలను’’ అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..మరో రెండు సినిమాలలో నటిస్తున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: