సినిమాల్లోనే బూతులనుకుంటే బుల్లి తెరను కూడా బూతులు ఆక్రమిస్తున్నాయి. అందులో జబర్దస్ట్ షో మరీను. ఇక దీనికి పోటీగా వచ్చిన అదిరింది షో లో కూడా సేం టూ సేం డబుల్ మీనింగ్ డైలాగులే.. ఈ రెండు షోలు కూడా బూతులను నమ్ముకునే సాగుతున్నాయని అంటున్నారు కొందరు. ఇకపోతే జబర్దస్త్ కామెడీ షో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుందనేది మెజారిటీ ఆడియన్స్ భావన. అదే సందర్భంలో ఈ షోలో వల్గర్ పంచ్‌లు, అక్రమ సంబంధాలు, మహిళల్ని కించపరిచేలా ద్వంద్వ అర్ధాలు, నీచమైన వ్యంగ్యస్త్రాలు పటాకుల్లా పేలుతున్నాయని అనుకునే వారు ఎక్కువ మందే ఉన్నారు.

 

 

ఇదిలా ఉండగా జబర్దస్త్ నుండి వేరుపడిన నాగబాబు, చమ్మక్ చంద్ర, ధనరాజ్, వేణు, కిర్రాక్ ఆర్పీలు ఈ ‘అదిరింది’ షోతో ఫన్ నింపేందుకు రెడీ అయ్యారు. మొత్తానికి జబర్దస్త్‌కి పోటీగా అదిరింది షోని రంగంలోకి దింపి జడ్జి నాగబాబు బుల్లితెర వార్‌కి కాలుదువ్వుతున్నారని అనుకుంటున్నారు.. ఇక ‘అదిరింది’ షోకి యాంకర్‌గా టీవీ నటి సమీరను తీసుకువచ్చారు. ఒకవైపు జబర్దస్త్ షోతో యాంకర్ రష్మి, అనసూయ తమ గ్లామర్ షోతో అదనపు ఆకర్షణగా నిలుస్తుంటే.. వీరికి పోటీగా సమీరను రంగంలోకి దింపింది జీ తెలుగు టీం. అయితే తొలి ఎపిసోడ్‌లో సమీర గ్లామర్ విషయంలో పెద్దగా పట్టింపులు లేవని చెప్పకనే చెప్పింది.

 

 

అయితే హావభావాల విషయంలో ఓన్‌గా ఐడెంటిటీ ఏర్పరచు కోవడానికి ఎక్కువ టైంపట్టే తీసుకునేలా ఉంది. ఎందుకంటే ఆమె ముఖంలో ప్లాస్టిక్ నవ్వులే కనిపిస్తున్నాయి తప్ప ఒరిజినల్ నవ్వుల పువ్వులు పూయడం లేదు. కానీ వల్గర్ పంచ్‌ల విషయంలో వాళ్లను దాటేసేటట్టుగానే కనిపిస్తోంది. ఇకపోతే ‘అదిరింది’ సెకండ్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

 

 

ఇందులో చమ్మక్ చంద్ర ‘బహుషా.. నిన్ను బందర్లో చూసి ఉంటా’ అంటూ భార్యతో కలిసి స్టెప్పులు వేస్తున్నాడు. ఆ స్టేప్స్ అయిపోయాక చమ్మక్ చంద్రకి భార్యగా నటించిన ఆమె ‘ఈ మొగుళ్లు మనకు అవసరమా.. సమీరా?’ అంటే.. పడి ఉండనెయ్యే.. అప్పుడప్పుడూ ఉపయోగపడతారని కామెడీ చేస్తుంది యాంకర్ సమీర. మొగుళ్లు అప్పుడప్పుడూ ఉపయోగపడతారా? అని చమ్మక్ చంద్ర ఆశ్చర్యంగా అడుగుతుంటే.. ‘హ హ హ అంటూ ఎప్పటిలాగే పడి పడి నవ్వుతున్నారు జబర్దస్త్ జడ్జి.. సారీ సారీ.. అదిరింది జడ్జి నాగబాబు గారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: