దిల్ రాజ్ తాను తీసే సినిమాల విషయంలో చాల తెలివిగా వ్యవహరిస్తాడు అన్న పేరు ఉంది. అయితే ‘ఇద్దరిలోకం ఒకటే’ లాంటి ఘోరమైన ఫ్లాప్ ను తీసిన దిల్ రాజ్ నిర్ణయాన్ని చూసిన వారు తన సినిమాల విషయంలో ఏకాగ్రత తప్పుతున్నాడా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరిచారు. అయితే ఈమూవీ విషయంలో అసలు విషయాలు వేరు అన్న ప్రచారం జరుగుతోంది. 


వాస్తవానికి ఈ సినిమా కథను మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ తొలి చిత్రం కోసం వ్రాసిన కథ అని అంటున్నారు. ఈకథ విని మహేష్ తిరస్కరించడంతో ప్రారంభం అయిన మహేష్ మేనల్లుడు మూవీ అప్పట్లో ఆగిపోయింది. దీనితో అలా ఆగిన సినిమాకు హీరోలు ఎవ్వరు దొరకక పోవడంతో దిల్ రాజ్ తెలివిగా ఆ కథను రాజ్ తరుణ్ కు చెప్పి ఒప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. 


‘లవర్’ మూవీ ఘోర పరాజయంతో అవకాశాలు లేక ఖాళీగా ఉన్న రాజ్ తరుణ్సినిమా కథ తనకు పూర్తిగా నచ్చకపోయినా ఒప్పుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో నటించిన రాజ్ తరుణ్ కు పారితోషికంగా 10 లక్షలు హీరోయిన్ షాలినీ పాండేకు 5 లక్షలు అతి తక్కువ పారితోషికం ఇచ్చి ఈ మూవీని కేవలం 2 కోట్ల బడ్జెట్ తో దిల్ రాజ్ పూర్తి చేసాడు అని అంటున్నారు. 

అయితే ఈసినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఈ మూవీకి సంబంధించి నాన్ థియేటర్ హక్కుల ద్వారా దిల్ రాజ్ తన పెట్టుబడిని తెలివిగా రాబట్టుకున్నాడు అన్న ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు కోటి రూపాయల పారితోషికం రేంజ్ కు చేరుకున్న రాజ్ తరుణ్ ఇప్పుడు 10 లక్షల పారితోషికానికి పడిపోయాడు అని వస్తున్న వార్తలు ఇప్పుడు ఈ హీరో పరిస్థితిని సూచిస్తున్నాయి. దర్శకుడు కొండా విజయ్ కుమార్ నిర్మాత రాథా మోహన్ లు రాజ్ తరుణ్ తో తీస్తున్న లేటెస్ట్ మూవీకి హీరోగా ఎంపిక అయిన రాజ్ తరుణ్ కు అసలు పారితోషికమే ఇవ్వడం లేదు అని వస్తున్న గాసిప్పులు ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇస్తున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: