టాలీవుడ్ ప్రేక్షకులకు అర్చన ఎవరో తెలుసు.  హీరోయిన్ గా చేసింది కొన్ని సినిమాలే.  ఖలేజా సినిమాలో ఆమె నటనకు చాలామంది ఫిదా అయ్యారు.  ప్రకాష్ రాజ్ పర్సనల్ అసిస్టెంట్ గా ఆమె చేసిన నటన ఆకట్టుకుంటుంది.  ఆ తరువాత ఏవో కొన్ని సినిమాలు చేసింది.  సినిమాల ద్వారా వచ్చిన డబ్బును వృధా చేయకుండా రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో పెట్టి దండిగానే సంపాదిస్తోంది.  ఇక సినిమా అవకాశాలు తగ్గిపోతున్నాయి అని తెలుసుకున్న ఈ అమ్మడు జగదీశ్ భక్తవత్సలమ్ అనే ఓ బిజినెస్ మెన్ ను నవంబర్ 14 వ తేదీన వివాహం చేసుకుంది.  


ఈ వివాహం తరువాత ఇద్దరు కలిసి హనీమూన్ కు వెళ్లారు.  అక్కడ ఈ అమ్మడు చాలా ఎంజాయ్ చేసిందట.  భర్తతో కలిసి బీచ్ లో ప్రకృతి మధ్యలో ఫోటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.  దీనికి సంబంధించితిన వీడియోలను కూడా ఈ అమ్మడు షేర్ చేస్తున్నది.  ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  


హీరోయిన్ హనీమూన్ ట్రిప్ వీడియో అంటే నెటిజన్లు సెర్చ్ చేస్తారు కదా మరి.  అలానే సెర్చ్ చేస్తూ వీడియోలను చూస్తున్నారు.  అర్చనకు కావాల్సింది కూడా అదే కదా మరి.  ఎందుకంటే, వీడియోలు నచ్చితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు.   ఇక అర్చన హనీమూన్ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.  మామూలుగానే హీరోయిన్ల హవా కొన్నాళ్లే ఉంటుంది.  గ్లామర్ ప్రపంచం కాబట్టి కొన్నాళ్ల తరువాత ఆ హవా తగ్గిపోతుంది.  


అలా హవా తగ్గుతుంది అనుకోగానే బిజినెస్ మెన్ ను చూసుకొని వివాహం చేసుకుంటారు.  లేదంటే  టాలీవుడ్ లోనే మరొకరిని చూసి వివాహం చేసుకొని లైఫ్ లో సెటిల్ అవుతారు.  కొన్నాళ్ల తరువాత సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అనిపిస్తే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. అందరిలానే అర్చన కూడా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుందా లేదంటే సినిమా ఇండస్ట్రీలోకి ఇక వెళ్లాల్సిన అవసరం ఏముందిలే అని చెప్పి కుటుంబానికే పరిమితం అవుతుందా చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: