జబర్దస్త్ షో ద్వారా అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు హైపర్ ఆది. టీవి షోలతో పాటు పలు సినిమాల్లో నటిస్తున్న హైపర్ ఆదికి భారీగా క్రేజ్ ఉంది. హైపర్ ఆది స్కిట్ల కోసమే జబర్దస్త్ చూసే బుల్లితెర ప్రేక్షకులు చాలామందే ఉన్నారు. యూట్యూబ్ లో కూడా హైపర్ ఆది స్కిట్లకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తాయి. జబర్దస్త్ షో సక్సెస్ కావడానికి హైపర్ ఆది ప్రధాన కారణం కాగా ఢీ షో సక్సెస్ లో కూడా హైపర్ ఆది పాత్ర ఉంది. 
 
ఢీ షోలో యాంకర్ ప్రదీప్ వేసే పంచులు అందరినీ ఆకట్టుకుంటాయనే విషయం తెలిసిందే. ఆ పంచులు రాసేది హైపర్ ఆది అని ఢీ షో సక్సెస్ లో హైపర్ ఆదికి కూడా భాగం ఉందని సుడిగాలి సుధీర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. జబర్దస్త్ షోకు మాత్రమే హైపర్ ఆది ఇప్పటివరకు పరిమితమై ఉన్నాడు. కానీ హైపర్ ఆది ఇప్పుడు ఢీ షోలోకి కూడా ప్రవేశించాడు. ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో ఒక టీమ్ కు సుధీర్, రష్మి టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తుండగా మరో టీంకు వర్షిణి, హైపర్ ఆది టీం లీడర్లుగా వ్యవహరించనున్నారు. 
 
ఇలాంటి సమయంలో ఒక ప్రముఖ యాంకర్ తో ట్రాక్ నడుపుతున్నానని హైపర్ ఆది బయటపెట్టాడు. ఇటీవల విడుదలైన ప్రోమోలో హైపర్ ఆది, వర్షిణితో కలిసి అల వైకుంఠపురములో సినిమాలోని సామజవరగమన పాటకు స్టెప్పులేశాడు. ఆ తరువాత హైపర్ ఆది మాట్లాడుతూ తనకూ వర్షిణికి మధ్య ట్రాక్ నడుస్తుందని డ్యాన్స్ నిజంగానే ఫీలై చేశామని చెప్పాడు. 
 
హైపర్ ఆది అలా చెప్పిన వెంటనే వర్షిణి ఆదీ.. నీకు కేవలం నడుస్తుందేమో నాకు పరుగెత్తుతోంది తెలుసా...? అంటూ సమాధానం ఇచ్చింది. ఇప్పటివరకూ ఢీ షో యాంకర్స్ రష్మి, సుధీర్ మధ్య ఏదో ఉందని యూట్యూబ్ లో, వెబ్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వార్తలు వచ్చాయి. కానీ రష్మి, సుధీర్ పలు సందర్భాల్లో కేవలం షో కోసం అలా చేశామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు హైపర్ ఆది, వర్షిణి మా ఇద్దరి మధ్య ట్రాక్ నడుస్తోందని చెప్పటంతో వీరిద్దరి మధ్య నిజంగానే ట్రాక్ నడుతోందా...? లేక షో కోసం క్రియేట్ చేశారా తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: