ఈ మధ్య కాలంలో మన చుట్టూ వున్నా సమాజంలో బలవన్మరణాలు ఎక్కువైపోయాయి .ఇలాంటివాటికి  నటి ,నటులు ఎక్కువగా పాల్పడుతున్నారు . తాజాగా  నటుడు కుశాల్‌ పంజాబీ బలవన్మరణానికి పాల్పడ్డాడు ఈ విషయాన్నీ  ముంబై పోలీసులు తెలిపారు. అంతేకాదు అక్కడికి వెళ్లి  అతడి మృతదేహం వద్ద సూసైడ్‌ నోట్‌ను  స్వాధీనం చేసుకున్నట్లు  పోలీసులు పేర్కొన్నారు. కుశాల్‌ పంజాబీ గురువారం అర్ధరాత్రి బాంద్రాలోని తన నివాసంలోనే   ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్నసూసైడ్‌ నోట్‌ లో   తన చావుకు ఎవరూ కారణం కాదని కుశాల్‌ లేఖలో పేర్కొన్నాడని తెలిపారు.

 

 అంతే కాదు తన ఆస్తి  పంపకాల గురించి కూడా ఆ నాట్ లో రాసారు, తన ఆస్తిని తల్లిదండ్రులు, తన కుమారుడికి సమానంగా పంచాలని కోరాడు. కుశాల్‌ పంజాబీ మరణం గురించి మొదట్లో పలు రకాలుగా మాట్లాడుకున్నారు కొందరు  కుశాల్‌ పంజాబీ హఠాన్మరణం చెందినట్లు కూడా భావించారు అలానే  వార్తలు కూడా వచ్చాయి. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో కుశాల్‌ స్నేహితుడు, నటుడు కరణ్‌వీర్‌ బోహ్రా  షేర్‌ చేయడంతో సెలబ్రిటీలు అతడి మృతికి సంతాపం తెలిపారు. అయితే ప్రస్తుతం కుశాల్‌ ఆత్మహత్య విషయం తెలిసి వారంతా షాక్‌కు గురవుతున్నారు. 

 

ఇక కుశాల్‌ మొదటిగా రియాలిటీ షో జోర్‌ కా జట్కాలో విజేతగా నిలిచిన వ్యక్తి ఆ తర్వాత  ఆయనకీ  బుల్లితెర నటుడిగా అవకాశం రావడం అందులో ఆయన మంచి  గుర్తింపు తెచ్చుకున్నాడు . అంతేకాదు కుశాల్‌  ఫియర్‌ ఫాక్టర్‌, నౌటికా నావిగేటర్స్‌ ఛాలెంజ్‌, ఝలక్‌ దిఖ్లా జా తదితర రియాలిటీ షోల్లో కూడా పాల్గొని అభిమానులను సంపాదించుకున్నాడు. వెండితెర మీద తన అదృష్టాన్ని ఫర్హాన్‌ అక్తర్‌ లక్ష్యా, కరణ్‌ జోహార్‌ కాల్‌ సినిమాలతో  కుశాల్‌ పరీక్షించుకున్నాడు. 

 

అతడికి భార్య, కుమారుడు ఉన్నారు. కాగా ప్రముఖ గాయకుడు బాబా సెహగల్‌ కుశాల్‌ మృతిపై  విచారం వ్యక్తం చేశాడు. ‘కుశాల్‌ లేడంటే నమ్మలేకపోతున్నాను. సవాళ్లను ఎదుర్కునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. తను ఓ మంచి తండ్రి. నా తమ్ముడి వంటి నీ ఆత్మకు శాంతి చేకూరాలి కుశాల్‌’ అని ఆయన ట్వీట్‌ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: