ఈ మ‌ధ్య హీరోయిన్లు ఇటు బాబాయ్‌తో అటు అబ్బాయితో ఇద్ద‌రితోనూ న‌టించ‌డం చాలా కామ‌న్ అయిపోయింది. ఒకే  ఫ్యామిలీ నుంచి వ‌చ్చే ఇద్ద‌రి హీరోల‌తో న‌టించేస్తూ రికార్డులు సృష్టించేస్తున్నారు. ఆల్రెడీ ఇలా కాజల్‌, నిధిఅగ‌ర్వాల్‌, ర‌కుల్‌ప్రీత్ సింగ్ ఇలా చాలా మందే ఉన్నారు. ఛార్మి కూడా గ‌తంలో ఇటు బాల‌కృష్ణ‌తో అటు జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో ఇద్ద‌రితోనూ న‌టించింది.  బాల‌య్య‌బాబుతో అల్ల‌రిపిడుగు, ఎన్టీఆర్‌తో రాఖీ చిత్రంలో న‌టించింది. ఇప్పుడు మ‌ళ్ళీ కేథ‌రిన్‌థెరిస్సా కూడా అలాగే న‌టించ‌బోతుంది. 

 

కేధరిన్ ఆరేళ్ళ క్రితం తెలుగులో అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఎప్పుడో ఒక సినిమాలో మినహా ఎక్కడా కనపడటం లేదు ఈ కేరళ అమ్మాయి. సిమిమాల కోసం దుబాయ్ నుంచి ఇండియా వచ్చేసిన ఈ భామ... సరిగా ఆరేళ్ళ క్రితం ఇద్దరమ్మాయిలతో అనే సినిమా చేసింది. ఆ తర్వాత సరైనోడు, రానా హీరోగా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నెగటివ్ రోల్ లో ఆకట్టుకుంది. ఈ సినిమాల్లో ఆమెకు మంచి గుర్తింపే వచ్చింది. గ్లామర్ తో పాటు నటనలో కూడా మంచి మార్కులే కొట్టేసింది.

 

రెండేళ్ళ నుంచి తెలుగులో సినిమా చేయని ఈ భామ ఇప్పుడు వరుసగా తమిళంలో సినిమాలు చేస్తుంది. ఈ తరుణంలో ఆమెకు బంపర్ ఆఫర్ వచ్చింది. నందమూరి హీరోలు ఇద్దరితోనూ నటించడానికి ఛాన్స్ దక్కింది. బాలకృష్ణ-బోయపాటి సినిమాలో హీరోయిన్ గా ఆమెకు అవకాశం ఇచ్చినట్టు సమాచార౦. ఇప్పటికే బోయపాటి ఆమె తో చర్చలు కూడా జరిపినట్టు సమాచార౦. గత కొన్ని రోజులుగా తెలుగులో ఆఫర్లు లేక ఇబ్బంది పడుతున్న ఆమెకు ఈ ఆఫర్ మళ్ళి ట్రాక్ లో పెట్టేలా కనపడుతుంది.

 

ఇక మరో ఆఫర్ కూడా ఈమెను వరించింది. నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న సోషియో ఫ్యాంటసి సినిమాలో ఆమెకు అవకాశం వచ్చినట్టు సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది షూటింగ్ కి వెళ్ళే అవకాశం కనపడుతుంది. ఇలా ఇద్దరు నందమూరి హీరోలతో ఒకే కాంపౌండ్ లో ఆమె సినిమాలు చేయడంతో ఆమె అభిమానులు కుషీ అవుతున్నారు. మరోవైపు విజయ్‌ దేవరకొండ నటిస్తున్న 'వరల్డ్ ఫేమస్ లవర్‌'లోనూ ఈమె నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మూడు సినిమాల్లో ఈమె కనిపించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: