ప్రస్తుతం రష్మిక క్రేజీ హీరోయిన్ స్థాయికి ఎదిగి పోయింది. దీనితో టాప్ యంగ్ హీరోలు అంతా తమ పక్కన హీరొయిన్ గా రష్మిక కావాలని అడుగుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో రష్మిక పారితోషికం ఇప్పుడు కోటిన్నర స్థాయిలో ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. 

అయితే ఊహించని విధంగా తమన్నా చేతిలో రష్మికకు అవమానం జరిగింది అంటూ నిన్న ఒక ప్రముఖ ఛానల్ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ కోసం రష్మికకు పారితోషికంగా 80 లక్షలు ఆ మూవీ నిర్మాతలు ఇస్తే అదే సినిమాలో నాలుగు నిముషాల ఐటమ్ సాంగ్ చేసినందుకు తమన్నాకు 40 లక్షలు పారితోషికంగా ఇచ్చారు అంటూ ఆ ఛానల్ ఒక షాకింగ్ కథనాన్ని ప్రసారం చేసింది. 

వాస్తవానికి రష్మిక ఈ మూవీలో తక్కువ పారితోషికానికి ఒప్పుకోవడం గల కారణం అని అంటున్నారు. మహేష్ తో నటిస్తే ఇక తాను టాప్ యంగ్ హీరోలు అందరితోను నటించే అవకాశం వస్తుంది అన్న వ్యూహంతో రష్మిక తన పారితోషికాన్ని ఒక కోటి నుండి 20 లక్షలు తగ్గించి 80 లక్షల తీసుకున్నట్లు ఆ ఛానల్ తన కథనంలో పేర్కొంది. 

అయితే ఈ మూవీకి ఒక మాస్ ఐటమ్ సాంగ్ అవసరం ఏర్పడటంతో ఆ పాటను తమన్నా తో చేయిస్తే క్రేజ్ ఏర్పడుతుంది అన్న ఉద్దేశ్యంతో ఈ మూవీ నిర్మాతలు ఆమె డిమాండ్ చేసినట్లుగా 40 లక్షలు పారితోషికం ఆమెకు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఈమధ్య కాలంలో తమన్నాకు అవకాశాలు తగ్గిపోయినా ఆమె గ్లామర్ రీత్యా ఐటమ్ సాంగ్ అవకాశాలు విపరీతంగా వస్తున్నాయి. అయితే ఆమె ఐటమ్ సాంగ్ చేసి గ్లామర్ ఎక్స్ పోజ్ చేసిన చాల సినిమాలు ఫెయిల్ అయ్యాయి. దీనితో రష్మిక పారితోషికం మొత్తంలో సగం మొత్తాన్ని తీసుకున్న తమ్మన్నా గ్లామర్ ఇంత వరకు ‘సరిలేరు నీకెవ్వరును రక్షిస్తుందో లేదో చూడాలి..    

మరింత సమాచారం తెలుసుకోండి: