ప్రస్తుతం తెలుగు టెలివిజన్ తెరపై మంచి రేటింగ్స్ తో పాటు ప్రేక్షకుల విశేష ఆదరణతో దూసుకెళ్తున్న జబర్దస్త్ షో నుండి ఇటీవల నాగబాబు, చమ్మక్ చంద్ర సహా మరికొందరు బయటకు వెళ్లారు. ఇక వారు ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారం అవుతున్న అదిరింది షోలో పాల్గొంటున్నారు. అయితే వారు షో నుండి బయటకు వెళ్ళిపోయినప్పటికీ, జబర్దస్త్ పై ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గకూడదని భావించిన నిర్వాహకులు, ఈ షో కు యాంకర్ గా వ్యవహరిస్తున్న అనసూయను మధ్యలో షోలో కొన్ని స్కిట్స్ లో నటింపచేస్తున్నారు. 

 

ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ కు నటుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరో రాజ్ తరుణ్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఇకపోతే ఈ ఎపిసోడ్ లో హైపర్ ఆదితో కలిసి సందడి చేసిన అనసూయ, ముందుగా ఒక బెంచ్ మీద కూర్చుని ఉండగా, ఆమె ప్రక్కన కొద్దిగా అవతల బెంచ్ పై ఆది కూర్చుని ఉంటాడు ఆది. ఏమి చేస్తున్నావ్ అని ఆది అడుగగానే, కనపడుతుందిగా పుస్తకం చదువుకుంటున్నాను అని చెప్తుంది అనసూయ. ఆ సమయంలో ఆది, ఆమెనే తదేకంగా చూస్తూ ఉంటాడు, వెంటనే అనసూయ అందుకుని, నువ్వు నా నడుం చూసావ్ కదా అంటూ ఆదితో కొద్దిపాటి గొడవకు దిగుతుంది, 

 

నువ్వు మాత్రం ఏమైనా తక్కువా, నన్ను ఇష్టపడ్డ విషయం నీ మనసులోనే దాచుకున్నవు కదా, నిజం చెప్పు అంటూ అనసూయను ప్రశ్నిస్తాడు. ఇక వారి సరదా వివాదం మధ్యకు లేడీ గెటప్ లో వచ్చిన శాంతి స్వరూప్, గణపతి వచ్చి, ఏవమ్మా మాటి మాటికీ అతను నీ నడుము చూసాడు చూసాడు అంటున్నవు, అసలు అది నడుమా లేక జెయింట్ వీల్ అంత ఉంది అంటూ అనసూయ నడుముపై పంచులు పిలుస్తారు. ఇక ఈ సరదా సన్నివేశం మొత్తం కూడా ప్రేక్షకుల్లో, అతిథుల్లో విపరీతమైన జోష్ ని నింపడంతో పాటు కొందరి ప్రేక్షకులు విజిల్స్, గోలలతో షో ని హోరెత్తించారు. ఇక ఈ స్కిట్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో అదిరిపోయే వ్యూస్ తో దూసుకుపోతోంది......!!

మరింత సమాచారం తెలుసుకోండి: