రాబోయే సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు వర్సెస్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ అన్నట్టుగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వాతావరణం నెలకొంది. గతంలో వీరిద్దరూ నటించిన సినిమాలు ఒకే రోజు విడుదల చేసి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వేడి వాతావరణం పుట్టించడం తాజాగా మరొకసారి ఇద్దరూ పోటీ పడుతున్న తరుణంలో రాబోయే సంక్రాంతి నువ్వానేనా అన్నట్టుగా వీరిద్దరూ నటించిన 'అల వైకుంఠ పురం లో' సినిమా వర్సెస్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమా మధ్య పోటీ తీవ్ర ఉత్కంఠ భరితంగా ఉంది. అయితే వచ్చే సంక్రాంతికి విడుదల ఎవరు బ్లాక్ బస్టర్ కొడతారో అన్న ఉత్కంఠ ఇండస్ట్రీలో కూడా నెలకొంది. వరుసగా రెండు సినిమాలు అదిరిపోయే విజయాలు కావడంతో మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకి సంబంధించి రిజల్ట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు సమాచారం. ఖచ్చితంగా వచ్చే సంక్రాంతికి 'సరిలేరు...' తో హ్యాట్రిక్ విజయం సాధించటం గ్యారెంటీ అని సినిమా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

 

ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ విజయశాంతి దాదాపు 13 సంవత్సరాల తర్వాత మళ్లీ మహేష్ బాబు సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వడం తో సినిమాపై అంచనాలు మరింత గా ఉన్నాయి. మరోపక్క అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' వంటి దారుణమైన డిజాస్టర్ తర్వాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకుని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో 'అల వైకుంఠ పురం లో' సినిమా ఓకే చేయడం జరిగింది. ఈ సినిమాలో కూడా సీనియర్ హీరోయిన్ టాబు చాలా కాలం తర్వాత నటిస్తున్న నేపథ్యంలో సినిమాకి మంచి క్రేజ్ ఏర్పడింది.

 

ఈ సినిమాతో కచ్చితంగా విజయం సాధించాలని అల్లు అర్జున్ స్టోరీ విషయంలో మరియు పాటల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుని ప్రతి సన్నివేశం హైలెట్ గా ఉండాలని ముందునుండి డైరెక్టర్ త్రివిక్రమ్ తో చెప్పటంతో చాలావరకు సినిమాకి సంబంధించిన అవుట్పుట్ అదిరిపోయే రీతిలో వచ్చినట్లు గ్యారెంటీగా ఈ సినిమా కూడా హిట్ అవుతున్నట్లు సమాచారం. అయితే మహేష్ వర్సెస్ అల్లు అర్జున్ అనే విషయానికి వస్తే డాన్సుల విషయంలో అల్లు అర్జున్ 'అలా వైకుంఠపురం లో' సినిమా అదరగొట్టే రీతిలో వేసినట్లు దీంతో ఈ దెబ్బకి వచ్చే సంక్రాంతికి వీళ్ళిద్దరిలో ఎక్కువ విజయావకాశాలు బన్నీకి ఉన్నట్లు ...రెండు సినిమాల సాంగ్స్ విషయంలో 'అలా వైకుంఠపురం లో' సినిమా పాటలకి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమా గ్యారెంటీ హిట్ అనే టాక్ చాలా బలంగా ఇండస్ట్రీలో వినబడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: