బాహుబలి సినిమాతో తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చూపించిన దర్శకధీరుడు ఎస్.సె. రాజమౌళి. బహుబలికి ఏ మాత్రం తగ్గకుండా అంతకుమించిన భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మకమైన సినిమా 'ఆర్.ఆర్.ఆర్'. ఈ సినిమాలో స్టార్ హీరోలుగా టాలీవుడ్ ని ఏలుతున్న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ నటిస్తుండటం విశేషం. ఇప్పటికే దాదాపు 70% సినిమా షూటింగ్ అయిపోయిందని చిత్రబృందమే అఫీషియల్ గా ప్రకటించింది. అయితే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ దాదాపు అయిపోవచ్చినప్పటికీ ఇప్పటికీ సింగిల్ లుక్ కూడా రిలీజ్ చేయకపోవడం ఫ్యాన్స్ కి కాస్త షాకిస్తోంది. ఈ క్రమంలో పలు వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో గాసిప్స్ పెద్ద ఎత్తున వస్తుండటంతో అసలు వేటిని నమ్మాలో..? వేటిని నమ్మకూడదో తెలియని పరిస్థితి నెలకొంది. 

 

'ఆర్.ఆర్.ఆర్' యూనిట్ నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని అటు ఎన్టీఆర్.. ఇటు చరణ్.. మరోవైపు జక్కన్న ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ టైమొచ్చేసిందని తాజా పరిస్థితులు చెబుతున్నాయి. ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ ప్రారంభమై కొన్ని నెలలు గడుస్తున్నా.. ఇంతవరకూ సినిమా టైటిల్‌గానీ.. సింగిల్ లుక్‌గానీ బయటికి రాలేదు. దీంతో అటు ఎన్టీఆర్.. ఇటు చెర్రీ.. మరోవైపు జక్కన్న అభిమానులు కాస్త అసంతృప్తికిలోనయ్యారు. అయితే తాజా సమాచారం ఏమిటంటే.. ఈ సినిమా 'ఫస్ట్ లుక్ పోస్టర్', 'టైటిల్‌'ని డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు రిలీజ్ చేయాలని చిత్రబృందం ముహూర్తం ఫిక్స్ చేసుకుందట. ఇది చరణ్, తారక్, జక్కన్న అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్ అని ఇంతకంటే ఎలా చెప్పలి. 

 

ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా.. ఆ వీరులకు సంబంధించి ముఖ్యమైన రోజుల్లో కూడా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు కానీ.. న్యూ ఇయర్‌ కానుగా ఇస్తున్నారంటే చిత్ర బృందం ప్లాన్ పర్‌ఫెక్ట్ అని తెలుస్తోంది. ఇప్పటివరకు అదుగో..ఇదుగో అంటూ న్యూస్ రావడం మామూలైపోయింది. అయితే ఈసారి మాత్రం పక్కా అని తెలుస్తోంది. ఇక రీసెంట్‌గా తారక్ లుక్ రివీల్ అయి జక్కన్న కి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో జక్కన్న చిత్ర యూనిట్ మొత్తానికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: