ప్రస్తుతం సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, మీ టూ ఉద్యమాలు పెద్ద ఎత్తున వచ్చిన విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని నటి శ్రీరెడ్డి పెద్ద ఎత్తున ఉద్యమించింది. కానీ ఆమె ఉద్యమానికి మద్యలోనే బ్రేక్ పడటం.. ప్రస్తుతం చెన్నైకి మకాం మార్చి అక్కడ నుంచి సెలబ్రెటీలపై తనదైన స్టైల్లో కామెంట్స్ చేస్తూ వస్తుంది. ఇక బాలీవుడ్ లో తనూశ్రీ దత్తా, కంగనా రౌనత్ లు గతంలో తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి పెద్ద ఎత్తున ఫైట్ చేశారు. తనూశ్రీ దత్త ప్రముఖ నటులు నానా పటేకర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఇదే సమయంలో ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ప్రముఖ రచయిత వైర ముత్తుపై కనీ వినీ ఎరుగని రీతిలో సంచలన ఆరోపణలు చేసింది.

 

సినీ పరిశ్రమలో అవకాశం వచ్చినవారిని తన మాయ మాటలతోమోసం చేస్తారని.. వారిని లైంగికంగా వేధిస్తారని తనను పది సంవత్సరాల క్రితం నీచమైన పద్దతిలో లైంగిక వేధింపులకు గురి చేశారని సంచలన ఆరోపణలు చేసింది.  ఆయన పచర్యలు తీసుకోవాలని..అవసరమైతే పోరాటం కూడా చేస్తానని అనడం అప్పట్లో కోలీవుడ్ లో ప్రకంపణలు సృష్టించాయి.   తాజాగా మరోసారి వైర ముత్తుపై సింగర్ చిన్మయి ట్విట్టర్ వేదికగా సంచలన ఆరోపణలు చేసింది. ఇలాంటి వారికే సినీ పరిశ్రమలో గుర్తింపు ఉంటుందని.. ఆరోపణలు చేసిన వారికే పని దొరక్కుండా చేస్తారు. తమిళ భాష పట్ల వైరాముత్తుకు ఉన్న పట్టును గుర్తించి ఈ డాక్టరేట్ ఇస్తున్నారని నాకు తెలుసు.

 

అదే విధంగా ఉత్తమ కామాంధుడు అనే పురస్కారం కూడా ఇస్తారని ఆశిస్తున్నా అంటూ సింగర్ చిన్మయి ట్విట్టర్ చేశారు. లోకమంతా ఆయనకు కీర్తి కండువా కప్పుతోంది. ఇక నాపై కామెంట్స్‌ చేస్తున్నారు.  అలాంటి వారందరికీ.. ఒక్క విషయం చెప్తున్నా.. మీ జీవితంలోనూ వైరాముత్తు లాంటి వ్యక్తి ఉంటే అప్పుడు నేనెంత బాధపడ్డానో తెలిసొస్తుంది. ఒక ఆడపిల్ల బాధను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: